Goa: కాంగ్రెస్కు స్పీకర్ షాక్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పిటిషన్ కొట్టివేత
- కాంగ్రెస్కు గోవా స్పీకర్ షాక్
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవాలో కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ రమేష్ తవాడ్కర్ షాకిచ్చారు. బీజేపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ హస్తం పార్టీ ఇచ్చిన పిటిషన్ను కొట్టేశారు. దీంతో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, అలీక్సో సిక్వేరా, సంకల్ప్ అమోన్కర్, మైఖేల్ లోబో, డెలీలా లోబో, కేదార్ నాయక్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, రాజేష్ ఫల్దేశాయి బీజేపీలో చేరారు. వీరిపై గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడంకర్ అనర్హత పిటిషన్ను దాఖలు చేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నారనే కారణంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 ప్రకారం పదో షెడ్యూల్లోని పారా 2 కింద అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను చోడంకర్ కోరారు. ఈ కేసులో అసలు రాజకీయ పార్టీ విలీనమే లేదని చోడంకర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
తాజాగా శుక్రవారం చోడంకర్ పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ తవాడ్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికైన సభ్యుని అసలు రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. ఎన్నికైన సభ్యుడు ఆకస్మిక పరిస్థితుల్లో అనర్హతను ఎదుర్కోరు. అంటే అతను విలీనానికి వెళ్లాలని ఎంచుకున్నా లేదా దానితో విభేదించినా కుదరదు.’’ విలీనమైతే ఫిరాయింపుల కారణంగా అనర్హత వేటు పడదని స్పీకర్ తవాద్కర్ తీర్పు చెప్పారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్న ప్రియాంక గాంధీ
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!