Rahul Gandhi: బీజేపీ రైతుల రుణాలని మాఫీ చేయదు..కానీ అదానీ రుణాలను మాఫీ చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలపై హమీల వర్షం కురిపించారు. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్గడ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని శనివారం హమీ ఇచ్చారు. ప్రధాని మోడీ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ వాళ్లు రైతుల రుణమాఫీ చేయరు కానీ, అదానీ రుణాన్ని మాత్రం మాఫీ చేయగలుగుతారని దుయ్యబట్టారు. గతంలో రైతుల రుణమాఫీ చేశాం, ఛత్తీస్గడ్ లో రైతులు రుణాలను మరోసారి మాఫీ చేస్తామని అన్నారు. ప్రతీ బ్యాంక్ అకౌంట్ లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు చేయలేదు, కానీ నేను తప్పుడు వాగ్దానాలు చేయను, చెప్పినవి చేసిచూపిస్తానని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
Read Also: 5 States Elections: గాడిదపై వచ్చి నామినేషన్.. ఎన్నికల సిత్రాలు..
బీజేపీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మా ప్రభుత్వం రైతులు, కార్మికులకు, పేదలకు సాయం చేస్తుంటే, బీజేపీ అదానీకి సాయం చేస్తుందని విమర్శించారు. ఛత్తీస్గఢ్లో రైతుల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, పాఠశాలలు మరియు కళాశాలలకు ఉచిత విద్యను కూడా గాంధీ హామీ ఇచ్చారు. ఛత్తీస్ గడ్ లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు.
బీజేపీ బీసీ కులగణనకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన నిర్వహిస్తామని చెప్పారు. 90 మంది ప్రభుత్వ కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారున్నారని, ఓబీసీల కోసం కేంద్రం 5 శాతం మాత్రమే ఖర్చు పెడుతోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!