PM Modi: సీఎం నితీష్ కుమార్తో కలిసి ప్రధాని మోడీ మెగా రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ బీహార్ రాజధాని పాట్నాలో మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి ఆదివారం ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. వేలాది మంది మద్దతుదారులు, బీజేపీ, జేడీయూ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ నేతన రవి శంకర్ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక వాహనంపై ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. ప్రధానిని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు.
Read Also: Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
40 లోక్సభ స్థానాలు ఉన్న బీహార్ ఎన్డీయే కూటమికి కీలకంగా మారింది. గతంలో 2019 ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఏకంగా 39 స్థానాలను గెలుచుకుంది. ఈ సారి కూడా క్లీన్స్వీప్ చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ 19న మొదటిదశలో ఔరంగాబాద్, గయా, జముయి మరియు నవాడ అనే నాలుగు నియోజకవర్గాలలో 49.26 శాతం ఓటింగ్ నమోదైంది. రెండవ దశలో, ఏప్రిల్ 26న 59.45 శాతం ఓటింగ్తో బంకా, భాగల్పూర్, కతిహార్, కిషన్గంజ్ మరియు పూర్నియా అనే ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మే 7న జరిగిన మూడో దశ ఝంజర్పూర్, సుపాల్, అరారియా, మాధేపురా మరియు ఖగారియా ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 58.18 శాతం ఓటింగ్ నమోదైంది. మే 13న జరిగే నాలుగో విడతలో రాష్ట్రంలోని 5 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు ఈసారి ఇండియా కూటమిలో భాగంగా ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 26 చోట్ల ఆర్జేడీ పోటీ చేస్తుండగా, మిగతా చోట్ల కాంగ్రెస్, లెఫ్ట్ పోటీ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..