Jairam Ramesh: అందుకోసమే ప్రధాని మోడీ ఇటలీ వెళ్తున్నారు.. కాంగ్రెస్ నేత విమర్శలు..
- G-7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లనున్న ప్రధాని మోడీ..
- తన ప్రతిష్ట పెంచుకోవడానికే వెళ్తున్నారన్న కాంగ్రెస్ నేత..
- ప్రధాని మోడీపై జైరాం రమేష్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 13-14 తేదీల్లో ఇటలీలోని అపులియా వేదికగా జరిగే జీ-7 సమ్మిట్లో పాల్గొనేందుకు మోడీ అక్కడికి వెళ్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా నరేంద్రమోడీకి ఆహ్వానం పంపించారు. ఈ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శించారు.
Read Also: WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్ట తగ్గిందని, తన ప్రతిష్టను కాపాడుకునేందుకే ఆయన ఇటలీకి వెళ్తున్నారని జైరాం రమేష్ అన్నారు. 2007లో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పర్యటను పోలుస్తూ.. మన్మోహన్ సింగ్ ‘‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’’గా ఉద్భవించారని, స్వీయ ప్రగల్భాల ద్వారా కాదని ప్రధాని మోడీని విమర్శించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జపాన్ దేశాల జీ-7 సమ్మిట్ 1970ల చివరి నుంచి జరుగుతోందని, 1997,2014 మధ్య రష్యా కూడా ఇందులో సభ్యదేశంగా ఉండేదని, 2003 నుంచి ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలను కూడా జీ -7 సమావేశాలకు ఆహ్వానించబడ్డాయని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ అన్నారు.
2007లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో మన్మోహన్ సింగ్ అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రపంచ వాతావరణ మార్పు చర్చలలో సమానత్వాన్ని నిర్ధారించడానికి ‘సింగ్-మెర్కెల్ ఫార్ములా’ను ప్రపంచానికి అందించారని రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ గుర్తు చేశారు. పీఎం మోడీని ఎగతాళి చేస్తూ, ఆయన మూడో వంతు ప్రధాని అని సంబోధించారు. చరిత్రను పీఎం మోడీ అంగీకరిస్తారని ఆశించలేమని ఆయన అన్నారు. అంతర్జాతీయ క్షీణించిన తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ రోజు ఇటలీకి ప్రధాని వెళ్తున్నారని విమర్శించారు. G7 సమ్మిట్లో భారతదేశం పాల్గొనడం ఇది 11వ మరియు G7 సమ్మిట్లో PM మోడీ వరుసగా ఐదవ పాల్గొనడం.
The G7 Summit of the heads of state of USA, Canada, Germany, France, Italy, UK and Japan has been taking place since the late 1970s. Between 1997 and 2014, Russia was also a member.
Since 2003, India, China, Brazil, Mexico and South Africa have also been invited to G7 Summits.… pic.twitter.com/4d2aXAOcRl
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 13, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!