WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
- ఏప్రిల్ నెల నివేదికను విడుదల చేసిన వాట్సప్
- నిబంధనలు ఉల్లంఘించే ఖాతాలపై ప్రత్యేక దృష్టి
- సైబర్ ఫ్రాడ్.. మోసాలు..హానికరమైన కంటెంట్లు ప్రచురించే అకౌంట్లకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. ఇవే కాకుండా తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధించింది. ఇప్పటికే దాదాపు 71 లక్షల భారతీయుల ఖాతాలను పూర్తిగా మూసేసింది. వాటిలో అత్యధిక ఖాతాలు సైబర్ ఫ్రాడ్, మోసాలకు సంబంధించినవని, మరికొన్ని వాట్సాప్ విధానాలను ఉల్లంఘించినవని వాట్సప్ నివేదిక వెల్లడించింది.
READ MORE: Pakistan: భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ ప్రశంసలు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
వాట్సాప్ ఏప్రిల్ కి సంబంధించిన నెలవారీ నివేదికను విడుదల చేసింది. 71,82,000 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. ఈ ఖాతాలు ఏప్రిల్ 1, 2024 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య ముసేసినట్లు తెలిపింది. ఈ వ్యక్తులు యాప్ను దుర్వినియోగం చేశారని పేర్కొంది. వాస్తవానికి, కంపెనీ అధునాతన మెషీన్ లెర్నింగ్, డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. దీని ద్వారా అనుమానాస్పద కార్యాచరణ ఉన్న ఖాతాలను త్వరగా గుర్తిస్తుంది. ఎందుకంటే ఈ యాప్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ వినియోగదారులను కలిగి ఉంది. వారు ప్రతిరోజూ ఈ అనువర్తనాన్ని ఉపయోగిస్తున్నారు. సందేశాలు, ఫోటోలు, వీడియోలు, ఆడియో సందేశాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. కాగా.. నిషేధించిన సైబర్ ఫ్రాడ్, మోసాలకు సంబంధించినవని, హానికరమైన కంటెంట్ను ప్రచురించే, చట్టలను ఉల్లంఘించినవి ఉన్నట్లు వాట్సప్ వెల్లడించింది. భవిష్యత్తులో వినియోగదారులు కంపెనీ విధానాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కూడా నిషేధం విధిస్తామని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!