Amit Shah: 4 దశల్లోనే బీజేపీ 270 సీట్లు దాటింది.. కాంగ్రెస్కి 40 కూడా రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీహార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తొలి నాలుగు దశల్లోనే ప్రధాని మోడీ 270 సీట్లను అధిగమించారని, కాంగ్రెస్ రాహుల్ గాంధీకి 40 సీట్లు కూడా రావని అన్నారు. పశ్చిమ చంపారన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ బాబాకు 40 సీట్లు కూడా రావని, లాలూ ప్రసాద్ యాదవ్కి 4 సీట్లు కూడా రావడం లేదని ఆయన అన్నారు.
గత 10 ఏళ్లలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కన్నా బీహార్కి తాము ఎక్కు నిధులు ఇచ్చామని చెప్పారు. సోనియా-మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లాలూ జీ మంత్రిగా ఉన్నారని, ఆయన బీహార్కి ఎంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,80,000 కోట్లు ఇస్తే, మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏకంగా రూ. 14,80,000 కోట్లు ఇచ్చిందని అమిత్ షా అన్నారు.
Also Read
- Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
- Rahul Gandhi: 'విద్యార్థులను చంపమని ఎవరు ఆదేశించారు?' అమిత్ షాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలు
- Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ని మనం గౌరవించాలని మాట్లాడిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన వారే ఇప్పుడు దానితో తిరుగుతున్నారని కాంగ్రెస్ని విమర్శించారు.
బీహార్లోని 40 స్థానాలకు గానూ 2019లో బీజేపీ-జేడీయూ కూటమి ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి ఈ కూటమి క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఈసారి కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడి బీహార్లో పోటీ చేస్తున్నాయి. ఆర్జేడీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక బీజేపీ-జేడీయూ కూటమిలో బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో, జితన్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: జూలై 30న హిట్ కొడుతున్నాం.. కాన్ఫిడెంట్గా ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్.. జయకృష్ణ నటనపై ప్రశంసలు
-
CM Chandrababu: మళ్లీ కూటమికి అధికారం ఖాయం.. కానీ..!
-
Lenovo Legion 27-1R: 27- ఇంచెస్ డిస్ప్లే, 280Hz రిఫ్రెష్ రేట్తో.. లెనోవో బడ్జెట్ గేమింగ్ మానిటర్ విడుదల.. ధర ఎంతంటే?
-
Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్గా సుమంత్.. ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!