Amit Shah: 4 దశల్లోనే బీజేపీ 270 సీట్లు దాటింది.. కాంగ్రెస్కి 40 కూడా రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీహార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తొలి నాలుగు దశల్లోనే ప్రధాని మోడీ 270 సీట్లను అధిగమించారని, కాంగ్రెస్ రాహుల్ గాంధీకి 40 సీట్లు కూడా రావని అన్నారు. పశ్చిమ చంపారన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ బాబాకు 40 సీట్లు కూడా రావని, లాలూ ప్రసాద్ యాదవ్కి 4 సీట్లు కూడా రావడం లేదని ఆయన అన్నారు.
గత 10 ఏళ్లలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కన్నా బీహార్కి తాము ఎక్కు నిధులు ఇచ్చామని చెప్పారు. సోనియా-మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లాలూ జీ మంత్రిగా ఉన్నారని, ఆయన బీహార్కి ఎంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,80,000 కోట్లు ఇస్తే, మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏకంగా రూ. 14,80,000 కోట్లు ఇచ్చిందని అమిత్ షా అన్నారు.
Also Read
- PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
- S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
- Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
- PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ని మనం గౌరవించాలని మాట్లాడిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన వారే ఇప్పుడు దానితో తిరుగుతున్నారని కాంగ్రెస్ని విమర్శించారు.
బీహార్లోని 40 స్థానాలకు గానూ 2019లో బీజేపీ-జేడీయూ కూటమి ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి ఈ కూటమి క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఈసారి కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడి బీహార్లో పోటీ చేస్తున్నాయి. ఆర్జేడీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక బీజేపీ-జేడీయూ కూటమిలో బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో, జితన్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్లో చెన్నై వీరవిహారం!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..