Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: సీజేపీ నిరసనలు, దేశ వ్యాప్తంగా ఉద్యమం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రాజీనామాకు ముందు జరిగిన పులు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల నిరసనల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రెండుసార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట. ప్రభుత్వం రాజీనామాను తిరస్కరించి విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూలై 20న జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలోనూ ప్రధాన్ తన రాజీనామా ప్రతిపాదనను ముందట ఉంచగా, “సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటికి పరిష్కారం చూపడమే మోడీ ప్రభుత్వ నైజం” అని పేర్కొంటూ నాయకత్వం ఆయనను పదవిలోనే కొనసాగాలని కోరిందట.
అయితే, కొన్ని కీలక పరిణామాల వల్ల ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తో జరిగిన రెండో విడత చర్చల అనంతరం, వారు జూలై 20 నాటి ‘చలో సంసద్’ తరహాలోనే మరో భారీ ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. అంతకుముందు జూలై 20 నిరసనల్లో పోలీసుల చర్య వల్ల పలువురు విద్యార్థులు గాయపడటం, దేశవ్యతిరేక శక్తులు ఈ ఆందోళనలను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను పెంచింది. డిజిటల్ మానిటరింగ్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. భారతదేశంలోని విద్యార్థుల నిరసనలను మరింత రెచ్చగొట్టడానికి పాకిస్థాన్ నుంచి నడుస్తున్న దాదాపు 100 ఇన్స్టాగ్రామ్ ఖాతాలతో సహా, 400 కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని ఖాతాలు గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేయడానికి ఉపయోగపడినట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా, ఢిల్లీ పోలీసుల ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ ద్వారా జూలై 20 నుండి 24 మధ్య జంతర్ మంతర్ పరిసరాల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న దాదాపు 400 మంది వ్యక్తులు తిరుగుతున్నట్లు గుర్తించారు.
Also Read
- PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
- కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
- Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
తాజావార్తలు
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..