PM Modi: సభలో భావోద్వేగం… చిన్నారి చూపిన అమ్మ ఫోటోతో మోడీ కంటతడి!
- బెంగాల్ సభలో ప్రధాని మోడీ భావోద్వేగం..
- చిన్నారి తెచ్చిన ఫోటో చూసి కంటతడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మరికొన్ని రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆదివారం రోజు ప్రధాని నరేంద్రమోడీ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన పురూలియాలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి, చిన్నారితో మాట్లాడారు. తన ప్రసంగం మధ్యలో చిరాగ్ అనే చిన్నారిని చూసి అకస్మాత్తుగా భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ఆయన మాట్లాడటం ఆపేశారు.
Read Also: Ali Khamenei: ఇరాన్లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
Also Read
- PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
- West Bengal: "వాడికి ఇదే సరైన శిక్ష".. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
చిన్నారి ప్రధాని మోడీ, ఆయన తల్లి ఉన్న ఫోటోను ప్రదర్శించాడు. ఇది చూసిన ఆయన తన వద్దకు ఫోటో తీసుకుమ్మని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. తన తల్లి ఫోటోను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మ ఫోటో తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను భావోద్వేగానికి గురిచేశావు’’ అని అన్నారు. ప్రధాని తమతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందని చిరాగ్, అతడి తల్లి చెప్పారు. ప్రధాని మోడీ తనకు లేఖ రాస్తానని చెప్పినట్లు చిరాగ్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని 294 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 152 స్థానాలకు ఏప్రిల్ 23, 2026న, 142 స్థానాలకు ఏప్రిల్ 29, 2026న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలను మే 4, 2026న ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. మరోవైపు, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని టీఎంసీ ప్రచారం చేస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..