Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
- ఆర్థిక సర్వేను సమర్పించిన ఆర్థిక మంత్రి
- సర్వేలో కీలక విషయాలు
- పెరిగి కంపెనీల లాభాలు
- ఉద్యోగులకు పెరగని జీతాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు 15 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు అందుకు అనుగుణంగా పెరగలేదని సర్వే పేర్కొంది.
READ MORE: Donald Trump: “జన్మహక్కు పౌరసత్వం” అర్హత లేని వ్యక్తులకు, అర్హత లేని పిల్లలకు కాదు..
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
ఆర్థిక, ఇంధనం, ఆటోమొబైల్ రంగాలు మంచి వృద్ధి సాధించాయి. దీని కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీలు లాభాలను ఆశించాయి. లాభాల్లో15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 59 పెద్ద కంపెనీలు, ముఖ్యంగా నాన్-ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీలు, తమ రంగంలోని చిన్న కంపెనీల కంటే మెరుగ్గా పనిచేశాయి. కంపెనీల లాభాలు పెరిగినా.. ఉద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నాయి. అంటే ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గుముఖం పట్టాయని సర్వే పేర్కొంది. కార్పొరేట్లో భారీ అసమానత ఏర్పడిందని సర్వే కుండ బద్దలు గొట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో లాభాలు 22.3% పెరిగాయి.. కానీ ఉపాధి 1.5% మాత్రమే పెరిగింది. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచే బదులు ఖర్చు తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్లో స్తబ్దత స్పష్టంగా కనిపిస్తోంది. లాభాల్లో ఎక్కువ వాటా తీసుకోవడం, ఉద్యోగుల జీతాలు పెంచకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది.
READ MORE: Union Budget 2025-26: బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!