Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
- ఆర్థిక సర్వేను సమర్పించిన ఆర్థిక మంత్రి
- సర్వేలో కీలక విషయాలు
- పెరిగి కంపెనీల లాభాలు
- ఉద్యోగులకు పెరగని జీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు 15 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు అందుకు అనుగుణంగా పెరగలేదని సర్వే పేర్కొంది.
READ MORE: Donald Trump: “జన్మహక్కు పౌరసత్వం” అర్హత లేని వ్యక్తులకు, అర్హత లేని పిల్లలకు కాదు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ఆర్థిక, ఇంధనం, ఆటోమొబైల్ రంగాలు మంచి వృద్ధి సాధించాయి. దీని కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీలు లాభాలను ఆశించాయి. లాభాల్లో15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 59 పెద్ద కంపెనీలు, ముఖ్యంగా నాన్-ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీలు, తమ రంగంలోని చిన్న కంపెనీల కంటే మెరుగ్గా పనిచేశాయి. కంపెనీల లాభాలు పెరిగినా.. ఉద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నాయి. అంటే ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గుముఖం పట్టాయని సర్వే పేర్కొంది. కార్పొరేట్లో భారీ అసమానత ఏర్పడిందని సర్వే కుండ బద్దలు గొట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో లాభాలు 22.3% పెరిగాయి.. కానీ ఉపాధి 1.5% మాత్రమే పెరిగింది. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచే బదులు ఖర్చు తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్లో స్తబ్దత స్పష్టంగా కనిపిస్తోంది. లాభాల్లో ఎక్కువ వాటా తీసుకోవడం, ఉద్యోగుల జీతాలు పెంచకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది.
READ MORE: Union Budget 2025-26: బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!