Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
- ఆర్థిక సర్వేను సమర్పించిన ఆర్థిక మంత్రి
- సర్వేలో కీలక విషయాలు
- పెరిగి కంపెనీల లాభాలు
- ఉద్యోగులకు పెరగని జీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు 15 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు అందుకు అనుగుణంగా పెరగలేదని సర్వే పేర్కొంది.
READ MORE: Donald Trump: “జన్మహక్కు పౌరసత్వం” అర్హత లేని వ్యక్తులకు, అర్హత లేని పిల్లలకు కాదు..
Also Read
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
ఆర్థిక, ఇంధనం, ఆటోమొబైల్ రంగాలు మంచి వృద్ధి సాధించాయి. దీని కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీలు లాభాలను ఆశించాయి. లాభాల్లో15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 59 పెద్ద కంపెనీలు, ముఖ్యంగా నాన్-ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీలు, తమ రంగంలోని చిన్న కంపెనీల కంటే మెరుగ్గా పనిచేశాయి. కంపెనీల లాభాలు పెరిగినా.. ఉద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నాయి. అంటే ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గుముఖం పట్టాయని సర్వే పేర్కొంది. కార్పొరేట్లో భారీ అసమానత ఏర్పడిందని సర్వే కుండ బద్దలు గొట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో లాభాలు 22.3% పెరిగాయి.. కానీ ఉపాధి 1.5% మాత్రమే పెరిగింది. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచే బదులు ఖర్చు తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్లో స్తబ్దత స్పష్టంగా కనిపిస్తోంది. లాభాల్లో ఎక్కువ వాటా తీసుకోవడం, ఉద్యోగుల జీతాలు పెంచకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది.
READ MORE: Union Budget 2025-26: బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!