Economic Survey 2024-25: భారీ లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు.. ఉద్యోగుల నోట్లో మట్టి!
- ఆర్థిక సర్వేను సమర్పించిన ఆర్థిక మంత్రి
- సర్వేలో కీలక విషయాలు
- పెరిగి కంపెనీల లాభాలు
- ఉద్యోగులకు పెరగని జీతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు 15 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఉద్యోగుల జీతాలు అందుకు అనుగుణంగా పెరగలేదని సర్వే పేర్కొంది.
READ MORE: Donald Trump: “జన్మహక్కు పౌరసత్వం” అర్హత లేని వ్యక్తులకు, అర్హత లేని పిల్లలకు కాదు..
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
ఆర్థిక, ఇంధనం, ఆటోమొబైల్ రంగాలు మంచి వృద్ధి సాధించాయి. దీని కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీలు లాభాలను ఆశించాయి. లాభాల్లో15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 59 పెద్ద కంపెనీలు, ముఖ్యంగా నాన్-ఫైనాన్షియల్ రంగంలోని కంపెనీలు, తమ రంగంలోని చిన్న కంపెనీల కంటే మెరుగ్గా పనిచేశాయి. కంపెనీల లాభాలు పెరిగినా.. ఉద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నాయి. అంటే ఉద్యోగుల జీతాలు మాత్రం తగ్గుముఖం పట్టాయని సర్వే పేర్కొంది. కార్పొరేట్లో భారీ అసమానత ఏర్పడిందని సర్వే కుండ బద్దలు గొట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో లాభాలు 22.3% పెరిగాయి.. కానీ ఉపాధి 1.5% మాత్రమే పెరిగింది. దీంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచే బదులు ఖర్చు తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్లో స్తబ్దత స్పష్టంగా కనిపిస్తోంది. లాభాల్లో ఎక్కువ వాటా తీసుకోవడం, ఉద్యోగుల జీతాలు పెంచకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది.
READ MORE: Union Budget 2025-26: బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!