PM Modi: ఇది “తుక్డే తుక్డే గ్యాంగ్” భాష.. కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల జమ్మూ కాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన రాజకీయ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని ప్రశ్నించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బీహార్లోని నవాడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Read Also: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు..
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
అంతకుముందు మోడీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. రాజస్థాన్ ప్రజలకు ఆర్టికల్ 370తో సంబంధం ఏంటని ఖర్గే ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంతో ఇక్కడి ప్రజలకు ఎందుకు సంబంధం లేదని ఖర్గేని అడిగారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాజస్థాన్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. అది వినడానికి నేను సిగ్గుపడుతున్నాను. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదా..?’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ జాగ్రత్తగా వినాలి, బీహార్ నుంచి చాలా మంది యువకులు, ధైర్యవంతులు మాతృభూమి కోసం భారీ త్యాగాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ని రక్షించడానికి ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారు’’ అని ప్రధాని అన్నారు.
దేశంలో ఒక ప్రాంతంలో మరో ప్రాంతానికి సంబంధం ఏంటని అడుగుతున్నారని, ఇది తుక్డే తుక్డే గ్యాంగ్ భాష అని ప్రధాని దుయ్యబట్టారు. అలాంటి వారిని క్షమించాలా.? అని ప్రశ్నించారు. ఖర్గే చెప్పిన మాటలు వినడం సిగ్గు చేటని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. ఏప్రిల్ 19న జరిగే తొలి విడత ఎన్నికల్లో బీహార్ లోని నవడా, గయా, ఔరంగాబాద్, జముయి లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!