Amit Shah: పాట్నాలో ఫోటో సెషన్ నడుస్తోంది.. విపక్షాల మీటింగ్పై సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు. కాశ్మీర్లో డెవలప్మెంట్ గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతకర్త, భారతీయ జన సంఘం వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. సాంబాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబొరేటరీకి శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం శ్రీనగర్కు వెళ్లి అక్కడ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వితస్తా ఫెస్టివల్లో పాల్గొని అనంతరం భద్రతా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
జమ్మూ కాశ్మీర్ లో రాళ్ల దాడులు 90 శాతం తగ్గుముఖం పట్టాయని, 70 శాతం ఉగ్రవాదం తగ్గిందని ఆయన అన్నారు. రాళ్లకు బదులు ఇక్కడి యువత ల్యాప్టాప్లను తీసుకువెళుతున్నారని షా అన్నారు. వారు ఇప్పుడు దేశ నిర్మాణానికి తోడ్పడుతున్నారని, బీజేపీ ప్రభుత్వ కృషి వల్లే ఇది జరిగిందని ఆయన అన్నారు. కాశ్మీర్లో పెట్టుబడులు, పర్యాటకుల రాక పెరిగిందని ఆయన అన్నారు.
Also Read
Read Also: Rahul Gandhi: తెలంగాణలో గెలుస్తాం.. ఎంపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ కనబడకుండా చేస్తాం…
ఈ రోజు బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న విపక్షాల సమావేశంపై అమిత్ షా సెటైర్లు వేశారు. వారు మోడీని సవాల్ చేస్తున్నామనే సందేశం ఇవ్వాాలని అనుకుంటున్నారు.. కానీ ఏం చేసినా, ఎప్పటికీ ఐక్యంగా ఉండలేరని అన్నారు. పాట్నాలో విపక్ష నేతల సమావేశాన్ని ఫోటో సెషన్ గా అభివర్ణించారు. 2024 ఎన్నికల్లో 300కు పైగా స్థానాల్ని సాధించి మరోసారి నరేంద్రమోడీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు.
మరోవైపు ఈ సమావేశంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దొంగలంతా ఒక్కచోట చేరారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు విమర్శించారు. బీజేపీని ఒంటరిగా ఓడించలేమని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఒప్పుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వారసత్వ రాజకీయాలు, వారి కుటుంబాలను కాపాడుకునేందుకు విపక్షాలు మీటింగ్ నిర్వహిస్తున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కుటుంబాలను కపాడుకునేందుకు విపక్షాలు ఏకం అవుతున్నాయని.. 2024 ఎన్నికల్లో బీజేపీ 400 పైగా స్థానాలు గెలుస్తుందని బీజేపీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!