Rahul Gandhi: తెలంగాణలో గెలుస్తాం.. ఎంపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ కనబడకుండా చేస్తాం…
Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోంది. మేము ప్రేమను పంచడానికి మరియు ఏకం చేయడానికి కృషి చేస్తున్నాము. ప్రతిపక్షాలు ఈరోజు ఇక్కడికి వచ్చాయి, కలిసి బీజేపీని ఓడిస్తాం అని ఆయన అన్నారు. భారతదేశంలో భావజాల యుద్ధం నడుస్తోందని.. ఒక వైపు కాంగ్రెస్ ‘భారత్ జోడో’ సిద్ధాంతం.. మరోవైపు ఆర్ఎస్ఎస్, బీజేపీల గురించి ‘భారత్ తోడో’ సిద్ధాంత ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్ రాష్ట్రంలో ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇకవేళ బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుస్తుందని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. భారతదేశాన్ని కలిపి ఉంచేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 15కు పైగా విపక్షాలు పాట్నాలో సమావేశమయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీయేతర విపక్షాలు అన్ని ఈ సమావేశానికి హాజరయ్యాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, హేమంత్ సొరెన్ హాజరయ్యారు. వీరితో పాటు కీలక నేతలు అఖిలేష్ యాదవ్, మహబూబా ముఫ్తీ, శరద్ పవార్, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మొదలైన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో