Delhi Assembly Elections: కేజ్రీవాల్కి షాక్, పెరిగిన బీజేపీ గ్రాఫ్.. ఢిల్లీలో గెలుపుపై తాజా సర్వే..
- హోరాహోరీగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
- బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోరు..
- సంచలనంగా పలోడీ సట్టా బజార్ తాజా అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి రంగం సిద్ధమైంది. రేపు(ఫిబ్రవరి 05)న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 36. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటలోపు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఉంటుంది.
Read Also: Layoffs 2025: ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న AI.. 2025లో భారీగా టెక్ లేఆఫ్స్..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇదిలా ఉంటే, ఢిల్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు ‘‘ఫలోడి సట్టా బజార్’’ ఎన్నికల అంచనాలను వెల్లడించింది. నిజానికి ఓటింగ్కి కొన్ని రోజుల ముందు వరకు సట్టా బజార్ అంచనాలు ఆప్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. ఆప్ మరోసారి అధికారం ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం పరిస్థితి దాదాపుగా మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ చాలా పెరిగింది. ఆప్కి అరవింద్ కేజ్రీవాల్కి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రిడిక్షన్ చెప్పింది.
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఆప్కి 35-37 సీట్లు రావచ్చని, బీజేపీకి 33-35 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతారనే అంచనాను వెల్లడించింది. ఈ అంచనాలే నిజమైతే, ఆప్కి ఈసారి ఎన్నికల్లో షాక్ తప్పకపోవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక రోజు ముందు గతంలో బీజేపీకి 31-33 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో కేజ్రీవాల్, బీజేపీ నుంచి ప్రవేశ్ శర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!