Layoffs 2025: ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న AI.. 2025లో భారీగా టెక్ లేఆఫ్స్..
- ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..
- 2025లో భారీగా లేఆఫ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Layoffs 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్ ప్రపంచంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)” మాటే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పుడు ఏఐ అభివృద్ధి ఉద్యోగులకు చేటు చేయబోతోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయి.
ఇప్పటికే, అన్ని అగ్రగామి టెక్ సంస్థలైన మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్, బీపీ వంటి కంపెనీలు తమ వర్క్ఫోర్స్ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. ఇవే కాకుండా చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేయబోతున్నాయి. ఎక్కువగా కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు వెళ్లడానికి, ఖర్చుల్ని తగ్గించుకోవాలని ఉద్యోగుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి.
Also Read
Read Also: Maharashtra: సీఎం ఫడ్నవీస్ మీటింగ్కి ఏక్నాథ్ షిండే మళ్లీ గైర్హాజరు.. ప్రభుత్వంలో విబేధాలు..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2025’ సర్వే ప్రకారం, పరిశ్రమల్లో ప్రధాన మార్పులు టెక్నాలజీ మార్పులు, జనాభా మార్పులు, భౌగోళిక-ఆర్థిక విచ్ఛిన్నం. AI టెక్నాలజీ పెరుగుదల కారణంగా ప్రపంచంలోని దాదాపు 41% కంపెనీలు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తమ శ్రామిక శక్తిని తగ్గించడంపై దృష్టి పెడతాయని సర్వే సూచించింది.
BI నివేదిక ప్రకారం, CNN, IBM, డ్రాప్బాక్స్ ఇప్పటికే ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఈ కంపెనీలు మాత్రమే కాకుండా, అనేక ఇతర కంపెనీలు ఖర్చులను ఆదా చేయడానికి మరియు వారి లాభాలను మెరుగుపరచడానికి ఉద్యోగుల్ని నియమించడం కంటే ఆటోమేషన్, AI వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
* డిజిటల్ ఆఫర్పై దృష్టిపెట్టడానికి సీఎన్ఎన్ టెలివిజన్లో పనిచేస్తున్న 200 మందిని తొలగించింది.
* స్టార్బక్స్ మార్చిలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
* ఇంజనీరింగ్, ఉత్పత్తి మరియు కార్యకలాపాలు వంటి విభాగాలలో స్ట్రైప్ 300 మందిని తీసేయనునంది.
*యూకే పెట్రోలియం కంపెనీ బీపీ సుమారుగా 7700 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
*మెటా కూడా 5శాతం మంది వర్క్ఫోర్స్ని తగ్గించనుంది.
*బ్లాక్రాక్ 200 మందిని తగ్గిస్తోంది.
*వాషింగ్టన్ పోస్ట్ 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!