Patna Terror Module: బీహార్ లో ఎన్ఐఏ దాడులు.. పాట్నా ఉగ్రకోణంపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA conducts raids at multiple locations in Bihar: బీహార్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఇటీవల బీహార్ పోలీసులు పాట్నా ఉగ్ర కుట్రను ఛేదించారు. ఈ కేసుపై ఎన్ఐఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్న కొంతమంది ఇళ్లపై దాడులు నిర్వహించారు. బీహార్ దర్భంగాలోని ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నూరుద్దీన్, సనావుల్లా, ముస్తకీమ్ ఇళ్లపై దాడులు చేసింది ఎన్ఐఏ. ఈ ముగ్గురు కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లో కీలక సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం ముగ్గురు అనుమానితుల్లో నూరుద్దీన్ ను ఇటీవల లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పాట్నా జైలులో ఉన్నాడు. మిగతా ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ఇటు ఎన్ఐఏ, బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. గురువారం ఈ ముగ్గురి గ్రామాల్లో ఎన్ఐఏ మూడు టీంలు సోదాలు నిర్వహించాయి. కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగిన మూడు ప్రాంతాల్లోని ప్రజలు సోషల్ డెమెక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కి మద్దతుదారులుగా ఉన్నారు. ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉందనే అనుమానంతో కొంతమంది వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
Read Also: Honey-Trap: పాకిస్తాన్ వలపు వలలో ఆర్మీ జవాన్.. అరెస్ట్
పుల్వారీ షరీఫ్ కేసుగా ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో భాగంగా బుధవారం ఎన్ఐఏ చంపారన్ జిల్లాలోని ఓ మసీదులో సోదాలు నిర్వహించింది. ఓ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుంది. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 26 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. బీహార్ పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీని చంపాలనే కుట్రను చేయడంతో పాటు 2047 వరకు భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే పత్రాలను ఇటీవల బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ కుట్రను బయటపెట్టారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..