Patna Terror Module: బీహార్ లో ఎన్ఐఏ దాడులు.. పాట్నా ఉగ్రకోణంపై దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA conducts raids at multiple locations in Bihar: బీహార్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ఇటీవల బీహార్ పోలీసులు పాట్నా ఉగ్ర కుట్రను ఛేదించారు. ఈ కేసుపై ఎన్ఐఏ కూడా విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఉగ్రకుట్రలో కీలకంగా ఉన్న కొంతమంది ఇళ్లపై దాడులు నిర్వహించారు. బీహార్ దర్భంగాలోని ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నూరుద్దీన్, సనావుల్లా, ముస్తకీమ్ ఇళ్లపై దాడులు చేసింది ఎన్ఐఏ. ఈ ముగ్గురు కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లో కీలక సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం ముగ్గురు అనుమానితుల్లో నూరుద్దీన్ ను ఇటీవల లక్నోలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పాట్నా జైలులో ఉన్నాడు. మిగతా ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం ఇటు ఎన్ఐఏ, బీహార్ పోలీసులు గాలిస్తున్నారు. గురువారం ఈ ముగ్గురి గ్రామాల్లో ఎన్ఐఏ మూడు టీంలు సోదాలు నిర్వహించాయి. కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగిన మూడు ప్రాంతాల్లోని ప్రజలు సోషల్ డెమెక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)కి మద్దతుదారులుగా ఉన్నారు. ఈ ఉగ్రకుట్రతో సంబంధం ఉందనే అనుమానంతో కొంతమంది వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
Read Also: Honey-Trap: పాకిస్తాన్ వలపు వలలో ఆర్మీ జవాన్.. అరెస్ట్
పుల్వారీ షరీఫ్ కేసుగా ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో భాగంగా బుధవారం ఎన్ఐఏ చంపారన్ జిల్లాలోని ఓ మసీదులో సోదాలు నిర్వహించింది. ఓ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుంది. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 26 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. బీహార్ పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీని చంపాలనే కుట్రను చేయడంతో పాటు 2047 వరకు భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే పత్రాలను ఇటీవల బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ కుట్రను బయటపెట్టారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. మాజీ పోలీస్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ ను అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
-
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
-
NALSAR: “CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం”.. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!