Honey-Trap: పాకిస్తాన్ వలపు వలలో ఆర్మీ జవాన్.. అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Army jawan, honey-trapped by two Pakistani women agents: భారతదేశాన్ని దెబ్బతీసేందుకు దాయాది దేశం పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోంది. దొంగదారిన భారత రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరించడానికి పాకిస్తాన్ గూఢాచార ఏజెన్సీ‘ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్’(ఐఎస్ఐ) తన ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐఎస్ఐ వలపు వలకు భారత ఆర్మీకి చెందిన ఓ సైనికుడు చిక్కాడు. ఐఎస్ఐకి చెందిన ఇద్దరు మహిళా ఏజెంట్ల హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భారత ఆర్మీ అతన్ని అరెస్ట్ చేసింది.
ఆర్మీ జవాన్ శాంతిమోయ్ రాణా ఇద్దరు మహిళలకు టచ్ లో ఉన్నాడని.. రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచమైన మహిళతో సంబంధాలు పెట్టుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం… ‘ ఆపరేషన్ సర్హద్’లో భాగంగా పాక్ గూఢాచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందని.. పశ్చిమ బెంగాల్ కు చెందిన బంకురాలోని కంచన్ పూర్ వాసి రాణా( 24) సదరు మహిళ ఏజెంట్లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని సున్నితమైన సమాచారాన్ని అందించారని అన్నారు. హనీట్రాప్ ఆరోపణన నేపథ్యంలో రాణా ఎలాంటి సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించారనే వివరాలను రాబట్టే పనిలో ఉంది ఆర్మీ. జూలై 25న రాణాలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
Read Also: Rashtrapatni Comments: కాంగ్రెస్ లో రచ్చకు దారితీసిన” రాష్ట్రపత్ని” వ్యాఖ్యలు..
రాణా మార్చి 2018లో ఆర్మీలో చేరాడు. రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విచారణలో కీలక విషయాలను రాణా వెల్లడించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ ఏజెంట్.. మొదట తన పెరును గర్నూర్ కౌర్ అలియాస్ అంకితగా.. యూపీలోని షాజహాన్ పూర్ నివాసిగా చెప్పుకుందని.. మరో ఐఎస్ఐ ఏజెంట్ నిషాతో కూడా రాణా సంప్రదింపులు నడిపారు. నిషా మిలిటరీ నర్సింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నట్లు చెప్పిందని.. రాణా అధికారులకు వెల్లడించారు. అతన్ని హనీ ట్రాప్ చేసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆర్మీకి సంబంధించిన రహస్య పత్రాలను , ఫోటోలను అడగటం ప్రారంభిచారని.. ఇంటలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్. సెంగతీర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..