Lok Sabha: బడ్జెట్ సమావేశాలు షురూ.. వక్ఫ్బోర్డు బిల్లుతో సహా 16 బిల్లులు.. ఏవేవంటే..!
- శుక్రవారం నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జె్ట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఇటీవల చనిపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలియజేయనున్నారు. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలు కూడా వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత శీతాకాల సమావేశాలు హాట్హాట్గా సాగాయి. అదానీ లంచాల వ్యవహారంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: GHMC Council : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలు జరుగుతున్నాయి. మొదటి సెషన్ ఫిబ్రవరి 13 వరకు జరుగుతుండగా.. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో దాదాపు 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో సహా 16 బిల్లులు బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనన్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ఎనిమిదో సారి శనివారం సమర్పించనున్నారు.
ఇక 2024-25 ఆర్థిక సర్వేను శుక్రవారం నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్నారు. అలాగే సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు 2025, వక్ఫ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టానికి సవరణలు, భారతీయ రైల్వేలు, భారతీయ రైల్వే బోర్డు చట్టాల విలీనంతో సహా 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే విపత్తు నిర్వహణ మరియు చమురు క్షేత్రాల చట్టాలకు సవరణలు చేసే అవకాశం ఉన్నాయి. తీరప్రాంత మరియు మర్చంట్ షిప్పింగ్కు సంబంధించిన బిల్లులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్కు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని.. దానిని ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా ప్రకటించాలని కోరుతూ మరొక బిల్లును కూడా సమర్పించవచ్చు. ఇక విమానయాన రంగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు.. ఇమ్మిగ్రేషన్ మరియు విదేశీయుల ప్రవేశానికి సంబంధించిన ప్రస్తుత నిబంధనలను మార్చడానికి ఉద్దేశించిన బిల్లులు కూడా ఈ సెషన్లో ప్రవేశపెట్టే ఛాన్సుంది. చివరగా గోవా రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం ఆశించిన మరో కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..