GHMC Council : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
- GHMC కౌన్సిల్ సమావేశం
- సమస్యలపై మేయర్, కమిషనర్ను నిలదీసిన కార్పొరేటర్లు
- సమస్యల పరిష్కారానికి టైం లిమిట్ పెట్టాలని BJP, MIM డిమాండ్
- ప్రధానంగా చెత్త, స్ట్రీట్ లైట్ల సమస్యపై చర్యలు తీసుకోవాలన్న కార్పొరేటర్లు
- కార్పొరేట్ స్కూల్స్ సరిగా ట్యాక్స్లు కట్టలేదన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Council : జీహెచ్ఎంసీ (GHMC) కౌన్సిల్ సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం ఆరంభమైన కొద్దిసేపట్లోనే రసాభాసగా మారింది. మేయర్ ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించగా, దీనికి బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్పై కాకుండా, ప్రజా సమస్యలపై మొదట చర్చించాలనే డిమాండ్తో ఈ రెండు పార్టీల కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వెళ్లగా, కాంగ్రెస్ (Congress) కార్పొరేటర్లు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి (C.N. Reddy), బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) బీఆర్ఎస్ సభ్యుల నుండి ప్లకార్డులను లాక్కొని చించేశారు. దాంతో, రెండు పార్టీల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాటకు దారి తీసింది.
Also Read
- Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
- APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
- IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసరడంతో మార్షల్స్ హస్తక్షేపం చేశారు. మార్షల్స్ హాల్లోకి ప్రవేశించి, తీవ్రంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేదని, గ్రేటర్ హైదరాబాద్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు.
ఇదే సమయంలో, బీజేపీ నేతలు కూడా ఈ గందరగోళంపై స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, సమావేశాన్ని సజావుగా నడవనీయకుండా ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించాలనే డిమాండ్ చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకోవడం వెనుక రాజకీయం ఉందని కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతల నడుమ గందరగోళ పరిస్థితుల్లో కొనసాగింది. మార్షల్స్ జోక్యంతో కొంత అదుపులోకి వచ్చినా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నిరసనను ఉధృతం చేయనున్నట్లు సంకేతాలు ఇవ్వగా, కాంగ్రెస్ నేతలు వారిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు, బీజేపీ ఈ తతంగాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్లను ఒకే గొడుగు కింద ఉన్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఈ ఘటనతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ముద్ర వేసిన ఈ సంఘటన మరిన్ని రాజకీయ విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది.
MLC Kavitha : కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి
తాజావార్తలు
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
-
Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!