Pakistan Train Hijack: ట్రైన్ హైజాక్ వెనక భారత్ హస్తం.. పాక్ సంచలన ఆరోపణ..
- బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ వెనక భారత్ హస్తం..
- పాకిస్తాన్ సంచలన ఆరోపణలు..
- ఆఫ్ఘన్ నుంచి బీఎల్ఏకి సాయం చేస్తున్నారని వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Train Hijack: పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్లో ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ హైజాక్కి గురైంది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలుని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఫైటర్స్ హైజాక్ చేశారు. అయితే, ఈ ఘటన వెనక భారతదేశ హస్తముందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం ఆరోపించింది. ఈ హైజాక్లో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు బలూచ్ ఫైటర్స్ చేతిలో మరణించారు.
విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైజాక్ వెనక ఉన్న బలూచ్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్లోని వారి సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని నిఘా నివేదికలు సూచించాయని చెప్పారు. భారత్ పేరు నేరుగా ప్రస్తావించకుండా, భారత్ హస్తముందనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. బీఎల్ఏ వంటి సంస్థలు దాని సరిహద్దుల్లో పనిచేయకుండా నిరోధించాలని పాక్ పదేపదే ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. జాఫర్ ఎక్స్ప్రెస్ దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Sunita Williams: స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ రెస్క్యూ మరోసారి వాయిదా.. కారణం ఏంటి..?
మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. ఈ హైజాక్లో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. భారత్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ దాడుల్ని నిర్వహిస్తోందని నిందించారు. డాన్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సనావుల్లా ఈ ఆరోపణలు చేశారు. భారత్ తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరియు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెండింటికీ మద్దతు ఇస్తోందని అన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు సంఘటన స్థలంలో ఉన్న 33 మంది ఉగ్రవాదులను హతమార్చాయని, మంగళవారం ఉగ్రవాదులు రైలుపై దాడి చేసినప్పుడు 21 మంది ప్రయాణికులను చంపారని అన్నారు. 450 మంది ప్రయాణికులతో వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ని బెలూచిస్తాన్లోని సెబి జిల్లా మారుమూల ప్రాంతంలో బీఎల్ఏ అదుపులోకి తీసుకుంది. పాక్ ప్రకారం, ఈ ఘటనలో 70-80 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!