Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistans False Propaganda That They Won Operation Sindoor

Pakistan: పాకిస్తాన్ స్కూల్ బుక్స్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’.. అన్ని అబద్ధాలే..

Published Date :September 24, 2025 , 3:41 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్ స్కూల్ బుక్స్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్‘‘..
  • తామే విజయం సాధించామని అబద్ధపు ప్రచారం..
Pakistan: పాకిస్తాన్ స్కూల్ బుక్స్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’..  అన్ని అబద్ధాలే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.

ఈ స్కూల్ బుక్స్‌లో భారత్-పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల ఘర్షణలో తామే పైచేయి సాధించినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది. భారతదేశం ఘర్షణను ప్రేరేపించిందని, పాకిస్తాన్ సైన్యం ప్రతీకారంగా భారత వైమానిక స్థావరాలను నాశనం చేసిందని, పాకిస్తాన్ యుద్ధంగో గెలిచిందని తప్పుడు ప్రచారాన్ని చేసుకుంది.

Also Read

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

అబద్ధం 1: పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదు.

పాక్ పాఠ్యపుస్తకంలో..‘‘6 మే 2025న, భారత దళాలు పాకిస్తాన్‌పై దాడి ప్రారంభించాయి, భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని పహల్గామ్ పట్టణంలో జరిగిన ఘోరమైన దాడిలో పాక్ ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేశాయి, అక్కడ చాలా మంది మరణించారు. ఈ తప్పుడు ఆరోపణలన్నింటినీ పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ, భారతదేశం మే 7, 2025న పాకిస్తాన్‌పై సైనిక దాడి చేసింది.’’ అని పేర్కొంది.

అబద్ధం2: పాకిస్తాన్ భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.

పాకిస్తాన్ మిలిటరీ గొప్ప ధైర్య, నైపుణ్యాలతో భారత దాడికి ప్రతిస్పందించాయని, పాక్ ఆర్మీ భారత ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌లో అనేక భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ 2025, మే 10న ఆపరేషన్ బన్యన్ ఉమ్ మర్సూస్ ప్రారంభించిందని పేర్కొంది. భారత వైమానిక దళం భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 26 వ్యూహాత్మక ప్రదేశాలను విజయవంతంగా టార్గెట్ చేసింది. అనేక స్థావరాలను నాశనం చేసిందని పాకిస్తాన్ తన పాఠ్యాంశాల్లో రాసుకొచ్చింది.

అబద్ధం 3: భారత్ శాంతి కోసం వేడుకుంది.

పాక్ దాడిలో భారీగా నష్టపోయిన భారత్, శాంతి కోసం వేడుకుంది. భారత్‌కు శాంతి కోరడం తప్పా వేరే మార్గం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అభ్యర్థించిన తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది.

అబద్ధం 4: ఫీల్డ్ మార్షల్ గౌరవం.

పాకిస్తాన్ సైన్యం యొక్క అత్యుత్తమ ప్రదర్శన, జనరల్ అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందారు – మొత్తం దేశానికి గర్వకారణమైన క్షణమని గొప్పలు చెప్పుకుంది.

నిజాలు ఇవే:
పాకిస్తాన్ తమ సొంత ప్రజల ముందు పరువు పోకుండా అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసింది. భారత దేశంలోని కొన్ని పార్టీల నేతలు కూడా పాక్ అబద్ధాలనే ఉటంకిస్తూ, భారత సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే పాక్ అసత్యాలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తోంది.

నిజానికి పాకిస్తాన్ భారత దాడిని తట్టుకోలేకపోయింది. భారత వైమానిక దాడుల్లో పాక్ లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు నాశనమయ్యాయి. ఈ విషయాలను స్వయంగా ఆ ఉగ్రవాద నాయకులే ఒప్పుకున్నారు. 100 కన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు మరణించారు. మోస్ట్ వాంటెండ్ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీలో 10 మంది మరణించారు. ఇక భారత దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా, స్కర్దు, లాహోర్, బోలారీ వంటి ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. దీనికి భారత్ సాక్ష్యంగా శాటిలైట్ చిత్రాలను కూడా చూపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asim Munir
  • India-Pakistan conflict
  • India-Pakistan War
  • misinformation
  • Operation Sindoor

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions