Sikh Referendum: సిక్కు వేర్పాటువాదులతో పాకిస్తాన్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పాక్ అసలు ఎజెండా మాత్రం వేరేలా ఉంది.
ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇస్తున్న శ్రీ దశమేష్ దర్బార్, గురునానక్ సిక్కు గురుద్వారాలను సందర్శించారు పాక్ అధికారులు. వేర్పాటువాద నేతలో రహస్యంగా సమావేశం అయ్యారు. గురునానన్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ అని స్నేహితులు చేతనే ఈ దశమేష్ దర్బార్ గురుద్వారా నిర్వహించబడుతోంది. నిజ్జర్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి. అతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. నాలుగు ఎన్ఐఏ కేసుల్లో ఇతడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నిజ్జర్ గతంలో ఓ హిందూ పురోహితుడిని చంపేందుకు ప్రయత్నించాడు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Funds for Bhanzu: ‘ప్రపంచంలోనే ఫాస్ట్ హ్యూమన్ క్యాలికులేటర్’ భాను సంస్థకి రూ.115 కోట్ల ఫండ్స్
కెనడాలోని జస్టిన్ ట్రూడో గవర్నమెంట్ భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవిస్తుందని ప్రకటించినప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల సిక్కువేర్పాటువాదులు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజ్జర్ తో పాటు, యూఎస్ లో ఉంటున్న వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పంజాబ్ ప్రత్యేక దేశం కావాలంటూ.. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ సిక్కు ఉగ్రవాదులకు పాకిస్తాన్ లాహెర్ లో ఆశ్రయం ఇస్తోంది. వేర్పాటువాదం వెనక పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఉంది.
సిక్కు రిఫరెండంపై గురువారం కెనడాకు భారత్ తన నిరసనను తెలియజేసింది. మిత్రదేశం కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!