India-Pakistan: ఇరాన్లో ఇండియన్స్ కిడ్నాప్ వెనక పాకిస్తాన్ హస్తం ఉందా..
- ఇరాన్లో భారతీయుల మిస్సింగ్ వెనక పాకిస్తాన్ హస్తం..?
- ఏజెంట్ మోసానికి గురైన ముగ్గురు యువకులు..
- ఇరాన్ మీదుగా ఆస్ట్రేలియా పంపిస్తామని మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: ఇటీవల ఇరాన్లో కనిపించకుండా పోయిన ముగ్గురు భారతీయుల కిడ్నాప్లో పాకిస్తాన్ హస్తం ఉందా.? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సంగ్రూర్కు చెందిన హుషాన్ప్రీత్ సింగ్, ఎస్బిఎస్ నగర్కు చెందిన జస్పాల్ సింగ్, పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన అమృత్పాల్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు మే 1న టెహ్రాన్తో దిగిన కొద్దిసేపటికి అదృశ్యమయ్యారు.
Read Also: Nara Lokesh: వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు.. జగన్పై లోకేష్ ఆగ్రహం..!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
అయితే, అదృశ్యమైన వ్యక్తుల్ని ఐఎస్ఐ భారత్ గూఢచారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించవచ్చని నివేదిక సూచిస్తున్నాయి. బాధితులను ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతామని హామీ ఇచ్చారు. వివరాల ప్రకారం, ముగ్గురు వ్యక్తులను పంజాబ్లోని ఓ ఏజెంట్ ఆకర్షించి దుబాయ్, ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని హామీ ఇచ్చారు. హోషియార్పూర్ లో ఉన్న ఈ ఏజెంట్ ప్రస్తుతం కనిపించకుండాపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ఐఎస్ఐతో ఏవైనా సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దర్యాప్తు జరుగుతోంది. విదేశీ మోజులో ఉన్న యువతను తప్పుదారి పట్టించే ఒక మానవ అక్రమ రవాణా నెట్వర్క్ని ఈ కేసు బహిర్గతం చేస్తోంది.
ముగ్గురు అదృశ్యంపై ఇరాన్ అధికారులతో భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న కుల్ భూషన్ జాదవ్ని ఇలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి భారత గూఢచారిగా ముద్ర వేసింది. దీంతో ఇప్పుడు ఈ ముగ్గురి అదృశ్యం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!