LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- భారత్- పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
- పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు
- అప్రమత్తమైన భారత సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LoC Ceasefire: భారత్- పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులకు పాల్పడగా, భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా తర్కుండి సెక్టార్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు ప్రారంభించింది. ప్రారంభంలో భారత సైన్యం దీనిని రెచ్చగొట్టే చర్యగా భావించి సంయమనం పాటించింది. అయితే కాల్పులు తీవ్రతరం కావడంతో భారత జవాన్లు గట్టిగా ప్రతిస్పందించారు. రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఈ ఫైర్ ఎక్స్చేంజ్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్లు సమాచారం.
దృష్టి మళ్లించే ప్రయత్నమా?
భద్రతా వర్గాల అంచనా ప్రకారం, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో నెలకొన్న పరిస్థితుల నుంచి జాతీయ, అంతర్జాతీయ దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ సైన్యం ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అప్రమత్తమైన భారత సైన్యం
సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని భారత సైన్యం నిశితంగా పర్యవేక్షిస్తోంది. గతంలో కూడా పాకిస్థాన్ వైపు నుంచి పలుమార్లు చొరబాటు ప్రయత్నాలు జరిగినప్పటికీ, భారత భద్రతా బలగాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. తాజా కాల్పుల నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం అప్రమత్తతను మరింత పెంచింది. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు నిఘా, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి ఘటన
గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ఈ స్థాయిలో భారీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. పరిస్థితిని భద్రతా దళాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.
తాజావార్తలు
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?