LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- భారత్- పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
- పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులు
- అప్రమత్తమైన భారత సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LoC Ceasefire: భారత్- పాకిస్థాన్ నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలిసారిగా పాకిస్థాన్ సైన్యం భారీగా కాల్పులకు పాల్పడగా, భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా తర్కుండి సెక్టార్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం, శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు ప్రారంభించింది. ప్రారంభంలో భారత సైన్యం దీనిని రెచ్చగొట్టే చర్యగా భావించి సంయమనం పాటించింది. అయితే కాల్పులు తీవ్రతరం కావడంతో భారత జవాన్లు గట్టిగా ప్రతిస్పందించారు. రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఈ ఫైర్ ఎక్స్చేంజ్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినట్లు సమాచారం.
దృష్టి మళ్లించే ప్రయత్నమా?
భద్రతా వర్గాల అంచనా ప్రకారం, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో నెలకొన్న పరిస్థితుల నుంచి జాతీయ, అంతర్జాతీయ దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ సైన్యం ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
అప్రమత్తమైన భారత సైన్యం
సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని భారత సైన్యం నిశితంగా పర్యవేక్షిస్తోంది. గతంలో కూడా పాకిస్థాన్ వైపు నుంచి పలుమార్లు చొరబాటు ప్రయత్నాలు జరిగినప్పటికీ, భారత భద్రతా బలగాలు వాటిని విజయవంతంగా తిప్పికొట్టాయి. తాజా కాల్పుల నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం అప్రమత్తతను మరింత పెంచింది. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు నిఘా, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి ఘటన
గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం నియంత్రణ రేఖ వెంబడి ఈ స్థాయిలో భారీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. పరిస్థితిని భద్రతా దళాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..