Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- రూ.3,000 తీసుకుని 9 ఏళ్లు సంబంధం చూపని మ్యారేజ్ బ్యూరో.
- సేవల్లో లోపం జరిగిందని తేల్చిన కన్స్యూమర్ ఫోరం.
- ఫీజు రీఫండ్తో పాటు రూ.5,000 నష్టపరిహారం, ఖర్చులు చెల్లించాలని ఆదేశం.
- 30 రోజుల్లో చెల్లించకపోతే 9% వడ్డీ విధింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Bureau: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల కోసం చాలా మంది మ్యారేజ్ బ్యూరోల వెంట పడుతున్నారు. మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్లలోనే పెళ్లిళ్లు కుదురుతున్నాయి. అయితే, దీని వెనక స్కామ్లు కూడా ఇలాగే ఉన్నాయి. పెళ్లి కాని అబ్బాయిలును, అమ్మాయిలను డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లకేళ్లు గడిచినా సంబంధాలు సెట్ చేయడంలో విఫలమవుతున్నారు. రేపు మాపు అంటూ అబ్బాయి లేదా అమ్మాయిని మానసికంగా వేధిస్తున్నారు.
ఇలాంటి మ్యారేజ్ బ్యూరోకు కేరళలో షాక్ తగిలింది. కన్నూర్లోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (కన్జ్యూమర్ కోర్టు) ఒక మ్యారేజ్ బ్యూరోపై భారీ ఫైన్ విధించింది రూ. 3000 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని 9 ఏళ్ల పాటు సరైన వివాహ సంబంధం చూపించడంలో విఫలమైంది. ఈ కేసులో మ్యారేజ్ బ్యూరో సేవల్లో లోపం ఉందని గుర్తించిన కోర్టు ఫీజు చెల్లించడంతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
కన్నూర్కు చెందిన ఓ నర్సింగ్ కళాశాల ప్రొఫెసర్ 2016 నవంబర్ 25న రూ.3,000 చెల్లించి ఒక మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్నారు. త్వరలోనే తగిన సంబంధం చూపిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. అయితే, సంవత్సరాలు గడుస్తున్నా ‘‘ఈసారి మంచి సంబంధం వస్తుంది’’ అంటూ హామీలు ఇచ్చింది కానీ వధువును వెతకడంతో విఫలమైంది. 9 ఏళ్లుగా ఒక్క సంబంధాన్ని చూపించలేకపోయింది.
తన పెళ్లి కోసం వృద్ధులైన తల్లిదండ్రులు ఎంతో కాలం ఎదురుచూశారని సదరు బాధిత ప్రొఫెసర్ కన్జ్యూమర్ ఫోరమ్లో తన వాదన వినిపించాడు. 2025లో తన తండ్రి క్యాన్సర్తో మరణించాడని, తల్లి కూడా అనారోగ్యంతో ఉందని చెప్పాడు. మ్యారేజ్ బ్యూరో సరైన సమయానికి తన బాధ్యత నిర్వర్తించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని చెప్పాడు.
ఫిర్యాదు విచారణకు వచ్చినప్పటికీ మ్యారేజ్ బ్యూరో తరుఫున ఎవరూ హాజరుకాలేదు. ఎలాంటి వివరణ కూడా సమర్పించలేదు. ప్రొఫెసర్ సమర్పించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫీజు చెల్లించిన ఆధారాలును ఫోరమ్ పరిశీలించింది. కమిషన్ మ్యారేజ్ బ్యూరోకు రూ. 3000 రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లించాలని, మానసిక వేదనకు రూ. 3000 పరిహారం ఇవ్వాలని, కోర్టు ఖర్చుల కింద రూ. 2000 ఇవ్వాలని, ఈ మొత్తాన్ని 30రోజుల్లో చెల్లించాలని, గడువులోగా చెల్లించకపోతే రీఫండ్ మొత్తంపై వార్షిక 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!