S Jaishankar: పెరట్లో పాములు పెంచితే పొరుగువారినే కాదు.. వారిని కూడా కాటేస్తాయి..
Pakistan as the “epicentre” of terrorism says jai shankar: ప్రపంచం ముందు భారతదేశాన్ని దోషిగా నిలబెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే భారత విదేశాంగ శాక మంత్రి ఎస్ జైశంకర్ మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాలకు హాజరైన జైశంకర్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ ఉగ్రవాదాన్ని భారత్ కన్నా మెరుగ్గా ఏ దేశం వాడుకోలేదు’’అంటూ పచ్చి ప్రేలాపనలు చేసింది హీనా రబ్బానీ.
Read Also: Avatar 2 Public Talk Live: అవతార్ 2 సినిమా రిలీజ్… పబ్లిక్ టాక్
Also Read
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. జైశంకర్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ప్రపంచం ఏం పిచ్చిది కాదు.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ ఘాటుగా బదులిచ్చారు. గతంలో హిల్లరీ క్లింటన్ గతంలో పాకిస్తాన్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘‘ మన పెరట్లో పాములు పెంచి పక్కవారిని కాటేయాలంటే ఎలా..? అవి మనల్ని కూడా కాటేస్తాయి’’ అని పాకిస్తాన్ కు హితవు పలికారు. కానీ పాకిస్తాన్ కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదని ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టు న్యూఢిల్లీ, కాబుల్, పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదాన్ని దక్షిణాసియా ఇంకెంత కాలం చూడబోతోందని ప్రశ్నించిన క్రమంలో జైశంకర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు వేరే మంత్రిని అడుగుతున్నారు.. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మీరు పాకిస్తాన్ మంత్రులను అడగాలంటూ మాస్ రిఫ్లై ఇచ్చారు. ఇటీవల లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీస్ సయీద్ ఇంటి ముందు గతేడాది బాంబు పేలుడు జరిగింది. అయితే దీనిపై భారత్ ను నిందిస్తూ పాకిస్తాన్ ఇటీవల ఓ ప్రకటన జారీ చేసింది. దీనిపై హీనా రబ్బాని ఖర్ భారత్ పై ఉగ్రవాద వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!