India-Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ని బహిష్కరించండి: పహల్గామ్ బాధితులు..
- మా కంట కన్నీరు ఆరిపోలేదు, అప్పుడే క్రికెట్ కావాలా..?
- ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరించండి..
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పహల్గామ్ బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan Match: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్లో భాగంగా ఆదివారం రెండు దేశాల మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో తమవారిని కోల్పోయిన బాధితులు ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ‘‘మా కళ్లలో నీళ్లు ఇంకా ఆరిపోలేదు. పాకిస్తాన్తో మ్యాచ్ కూడా జరుగుతుందా..?’’ అని బాధితురాలు కిరణ్ బెన్ ప్రశ్నించారు. ఆమె భర్త సుదీర్భాయ్ పర్మార్, 17 ఏళ్ల కుమారుడు స్మిత్ యతీష్బాయ్ పర్మార్లను ఈ మారణహోమంలో కోల్పోయారు.
Read Also: Kantara Chapter 1: కన్నడలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్న కాంతార చాప్టర్-1 మేకర్స్
Also Read
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలని సదరు కుటుంబం కోరింది. ఈ నేపథ్యంలో బాధితులు, అమరవీరుల కుటుంబాలు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ముఖ్యమైంది కాదని భావిస్తున్నామని చెబుతున్నారు. మీడియాతో కిరణ్ బెన్ మాట్లాడుతూ.. ‘‘మా కళ్ళలో కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదు, మరియు వారు మ్యాచ్ ఆడుతున్నారు. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవడం వినడం కూడా బాధాకరం, వారు ఆడటం చూడటం గురించి చెప్పనవసరం లేదు. ఆపై మన సైనికులు కూడా అమరులయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాద రాజ్యంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలి.’’ అని భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. పాక్ సైన్యం భారత్పై దాడికి యత్నించడంతో, భారత్ పాకిస్తా్న్ ఎయిర్బేసుల్ని నాశనం చేసింది.
తాజావార్తలు
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!