India-Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ని బహిష్కరించండి: పహల్గామ్ బాధితులు..
- మా కంట కన్నీరు ఆరిపోలేదు, అప్పుడే క్రికెట్ కావాలా..?
- ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ను బహిష్కరించండి..
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పహల్గామ్ బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan Match: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్లో భాగంగా ఆదివారం రెండు దేశాల మధ్య ఆసక్తికరపోరు జరుగనుంది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో తమవారిని కోల్పోయిన బాధితులు ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ‘‘మా కళ్లలో నీళ్లు ఇంకా ఆరిపోలేదు. పాకిస్తాన్తో మ్యాచ్ కూడా జరుగుతుందా..?’’ అని బాధితురాలు కిరణ్ బెన్ ప్రశ్నించారు. ఆమె భర్త సుదీర్భాయ్ పర్మార్, 17 ఏళ్ల కుమారుడు స్మిత్ యతీష్బాయ్ పర్మార్లను ఈ మారణహోమంలో కోల్పోయారు.
Read Also: Kantara Chapter 1: కన్నడలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్న కాంతార చాప్టర్-1 మేకర్స్
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కొనసాగించాలన్న బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలని సదరు కుటుంబం కోరింది. ఈ నేపథ్యంలో బాధితులు, అమరవీరుల కుటుంబాలు పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ముఖ్యమైంది కాదని భావిస్తున్నామని చెబుతున్నారు. మీడియాతో కిరణ్ బెన్ మాట్లాడుతూ.. ‘‘మా కళ్ళలో కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదు, మరియు వారు మ్యాచ్ ఆడుతున్నారు. ప్రజలు దాని గురించి మాట్లాడుకోవడం వినడం కూడా బాధాకరం, వారు ఆడటం చూడటం గురించి చెప్పనవసరం లేదు. ఆపై మన సైనికులు కూడా అమరులయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాద రాజ్యంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలి.’’ అని భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. పాక్ సైన్యం భారత్పై దాడికి యత్నించడంతో, భారత్ పాకిస్తా్న్ ఎయిర్బేసుల్ని నాశనం చేసింది.
తాజావార్తలు
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..