Mohan Bhagwat: దేశ ప్రజల్లో మన గుర్తింపు గురించి అవగాహన కొరవడిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్ర నాగ్పూర్లో గురువారం జరిగిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ గుర్తింపు హిందువు అని గర్వంగా గుర్తించాలని ఆయన అన్నారు. ‘‘మళ్లీ మళ్లీ ఎవరో రావడం వల్ల మన తప్పుల వల్ల బానిసలుగా మారుతాము. దీనిని పరిష్కరించాలి. ఈ ప్రాథమిక తప్పులకు చికిత్స చేయాలి. లేకుంటే ఇలాంటివి జరుగతూనే ఉంటాయి.’’ అని ఆయన అన్నారు.
Read Also: Israel-Iran Conflict: ఇరాన్పైకి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయిల్..
దేశం మొత్తం సమాజాన్ని కలిపి ఉంచాల్సిన అవసరం ఉందని, తద్వారా మన గుర్తింపు గురించి మనం స్పష్టంగా ఉండగలమని అన్నారు. అవగాహన లేని కారణంగా మన దేశంలో మనం ఎవరు.. మనవారు ఎవరు, మన గుర్తింపు గురించి స్పష్టత లేదని, అనేక ఏళ్ల బానిసత్వం కారణంగా, మానసిక అణచివేతకు గురయ్యామని చెప్పారు. మనందరిని ఏకం చేసే ఉమ్మడి సూత్రంతో మొత్తం సమాజాన్ని వ్యవస్థీకరించాలన్నారు. మన గుర్తింపును స్పష్టంగా తెలుసుకోవాలి, ప్రపంచానికి కూడా చెప్పాలి. మనం ఎవరమో మనకు తెలిస్తే మన గుర్తింపు కూడా తెలుస్తుందని అన్నారు. హిందువులం, మనం హిందువులమని గర్వంగా చెప్పుకోవాలని అన్నారు.