Operation Sindoor: పాఠ్యాంశంగా ఆపరేషన్ సిందూర్.. సిలబస్గా చేర్చిన మదర్సాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ను మదర్సాలలో పాఠ్యాంశంగా చేరుస్తామని ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ షామూన్ ఖాస్మీ తెలిపారు. పిల్లలకు సైనిక ధైర్యం, జాతీయ ఐక్యతను నేర్పడానికి ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు 2025 నుంచి పాఠ్యాంశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ను చేర్చనుందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముస్లిం బోర్డు సమావేశం అయిన తర్వాత బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
ముస్లిం సమాజమంతా ప్రధాని మోడీతో ఉన్నామని.. ముస్లింల అభిప్రాయాలను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు తెలియజేసినట్లు చెప్పారు. ఇక మదర్సాలలో చదువుతున్న పిల్లలకు ఆపరేషన్ సిందూర్ గురించి నేర్పిస్తామని తెలిపారు. పాకిస్థాన్.. మన అమాయక పౌరులను చంపిందన్నారు. దేశం ముఖ్యమైనది కాబట్టే.. ఆపరేషన్ సిందూర్ను సిలబస్లో చేరుస్తున్నట్లు చెప్పారు. విజయవంతమైన ఆపరేషన్ సిందూర్ గురించి పిల్లలకు నేర్పిస్తే.. మన సైనికుల శక్తి, ధైర్యం ఏంటో తెలుస్తుందన్నారు. పౌర ప్రాణనష్టం జరగకుండా ఎలా యుద్ధం చేయాలో భవిష్యత్ తరాలు అర్థం చేసుకుంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సమాజాన్ని ప్రధాన స్రవంతి సమాజం నుంచి దూరం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో మదర్సాలు జాతీయ ఐక్యత మరియు అవగాహనకు దోహదపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: Shoyu : నాగ చైతన్య రెస్టారెంట్ ఫుడ్లో బొద్దింక.. పోస్ట్ వైరల్
ఉత్తరాఖండ్ మదర్సా బోర్డు చట్టం 2016 ప్రకారం.. మదర్సాలకు సిలబస్ను నిర్ణయించడం, పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం, బోధనా సామగ్రిని సిద్ధం చేసే అధికారం బోర్డుకు ఉంది. గతంలో రామాయణం మరియు మహాభారతం వంటి సంస్కృత మరియు హిందూ ఇతిహాసాలను మదర్సా విద్యలో ప్రవేశపెట్టే ప్రణాళికలను ఖాస్మీ ప్రకటించారు. అయితే ఈ మార్పులు ఇంకా అమలు చేయలేదు.
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!