Parliament Session: పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్పై చర్చ.. కేంద్రం కీలక ఆదేశాలు!
- ఆపరేషన్ సిందూర్పై చర్చకు కేంద్రం సిద్ధం..
- సోమవారం నుంచి ఉభయ సభల్లో చర్చకు కేంద్రం నిర్ణయం..
- సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ..
- ఆపరేషన్ సిందూర్పై చర్చ కోసం సమయం కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Session: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్లో పాక్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో సోమవారం (జూలై 28న) నాడు ఆపరేషన్ సింధూర్పై చర్చ జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ చర్చకు లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయాన్ని కేటాయించింది. ఇక, ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Read Also: Money Laundering Scam: CBI ముసుగులో 79 ఏళ్ల వ్యక్తి నుండి రూ.35.74 లక్షలు దోపిడీ..!
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
అయితే, విపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్పై సంపూర్ణ వివరాలు వెల్లడించాలని గత మూడు రోజులుగా పార్లమెంట్లో చర్చ నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లోనూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రేపటికి పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక, పార్లమెంట్ ఆవరణలో ఈరోజు మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ విదేశాంగ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
ఇక, పాకిస్థాన్తో యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. దీని వెనుక కారణం ఏంటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండో-పాక్ ఉద్రిక్తతల సమయంలో ఐదు యుద్ధ విమానాలు కూలిన విషయాన్ని ట్రంప్ అనేక సార్లు వ్యాఖ్యానించాడని పేర్కొన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని చెబుతునే.. మరోవైపు విజయవంతమైందని అంటున్నారు.. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆపరేషన్ను తానే ఆపినట్టు ఇప్పటి వరకు 25 సార్లు చెప్పారని గుర్తు చేశారు. దీంట్లో ఏదో మర్మం ఉంది.. మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానానికి అంతర్జాతీయ మద్దతు దొరకడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..