Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
- చైనీయులకు శుభవార్త
- రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి తిరిగి దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత వీసాలను భారత్ పునరుద్ధరించింది. రేపటి నుంచి చైనీయులకు వీసాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bihar: ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. జూలై 24 నుంచి చైనా పౌరులకు భారతదేశం పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభిస్తుందని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి, వీసా సేవలను పునఃప్రారంభించడానికి, భారతీయ యాత్రికులు కైలాష్ మానసరోవర్కు ప్రయాణించడానికి అనుమతించడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. తాజాగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పడానికి భారత్ కీలక చర్యలు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి రెండు రోజుల పర్యటన కోసం బీజింగ్కు వెళ్లారు. అత్యున్నత స్థాయిలో జరిగిన సమావేశం తర్వాత ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2025 వేసవిలో కైలాష్ మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సరిహద్దు నదులకు సంబంధించిన జలసంబంధమైన డేటా భాగస్వామ్యం, ఇతర సహకారాన్ని చర్చించడానికి భారతదేశం-చైనా నిపుణుల స్థాయి యంత్రాంగం ముందస్తు సమావేశానికి కూడా వారు కట్టుబడి ఉన్నారని MEA తెలిపింది.
ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల మండలి ప్రతినిధి బృందంలో భాగంగా బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కూడా కలిశారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జరిగిన ప్రత్యేక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకున్నారు. చైనా పర్యటన సంతృప్తినిచ్చిందని జైశంకర్ ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!