Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
- చైనీయులకు శుభవార్త
- రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం నుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2020లో సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు తెగాయి. తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి తిరిగి దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల తర్వాత వీసాలను భారత్ పునరుద్ధరించింది. రేపటి నుంచి చైనీయులకు వీసాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Bihar: ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. జూలై 24 నుంచి చైనా పౌరులకు భారతదేశం పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభిస్తుందని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి, వీసా సేవలను పునఃప్రారంభించడానికి, భారతీయ యాత్రికులు కైలాష్ మానసరోవర్కు ప్రయాణించడానికి అనుమతించడానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. తాజాగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పడానికి భారత్ కీలక చర్యలు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి రెండు రోజుల పర్యటన కోసం బీజింగ్కు వెళ్లారు. అత్యున్నత స్థాయిలో జరిగిన సమావేశం తర్వాత ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2025 వేసవిలో కైలాష్ మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సరిహద్దు నదులకు సంబంధించిన జలసంబంధమైన డేటా భాగస్వామ్యం, ఇతర సహకారాన్ని చర్చించడానికి భారతదేశం-చైనా నిపుణుల స్థాయి యంత్రాంగం ముందస్తు సమావేశానికి కూడా వారు కట్టుబడి ఉన్నారని MEA తెలిపింది.
ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల మండలి ప్రతినిధి బృందంలో భాగంగా బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కూడా కలిశారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జరిగిన ప్రత్యేక చర్చల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకున్నారు. చైనా పర్యటన సంతృప్తినిచ్చిందని జైశంకర్ ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి ఇన్నాళ్లకు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!