26/11 Mumbai attacks: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, అణిచివేస్తాం.. ముంబై దాడులపై ప్రధాని మోడీ..
26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేము. ఈరోజునే దేశంలో భయంకరమైన ఉగ్రదాడి జరిగింది’’ అని అన్నారు.
ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిందరికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. దేశం అమరవీరులైన వీర జవాన్లను స్మరించుకుంటోందని అన్నారు. ముంబై, దేశం మొత్తం ఉగ్రదాడుల కారణంగా వణికిపోయిందని, ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి భారత్ తన సామర్థ్యాన్ని ఉపయోగింకుందని, ఇప్పుడు ఉగ్రవాదాన్ని అణిచివేసే ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. 26/11 దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. దాడికి ప్రణాళిక, అమలు చేసిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలనే భారత్ తపన మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
ముంబైలో 2008లో ఇదే రోజున భారీ ఉగ్రదాడి జరిగింది. 10 మంది ఉగ్రవాదులు ఆర్థిక రాజధానితో పాటు దేశాన్ని వణికించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబై చేరుకుని మారణహోమానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో 166 మందిని చంపారు. 300 మంది ఈ దాడుల్లో గాయపడ్డారు.
ఐకానిక్ తాజ్ మరియు ఒబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్లను లక్ష్యంగా చేసుకుని వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిలీలు, భారతీయులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు 9 మంది ఉగ్రవాదుల్ని హతమార్చగా.. కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. 2010లో ఇతని భారత్ ఉరితీసింది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?