26/11 Mumbai attacks: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, అణిచివేస్తాం.. ముంబై దాడులపై ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేము. ఈరోజునే దేశంలో భయంకరమైన ఉగ్రదాడి జరిగింది’’ అని అన్నారు.
ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిందరికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. దేశం అమరవీరులైన వీర జవాన్లను స్మరించుకుంటోందని అన్నారు. ముంబై, దేశం మొత్తం ఉగ్రదాడుల కారణంగా వణికిపోయిందని, ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి భారత్ తన సామర్థ్యాన్ని ఉపయోగింకుందని, ఇప్పుడు ఉగ్రవాదాన్ని అణిచివేసే ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. 26/11 దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. దాడికి ప్రణాళిక, అమలు చేసిన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలనే భారత్ తపన మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
Read Also: Mansoor Ali Khan: త్రిషపై కామెంట్స్ కలకలం.. ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా
ముంబైలో 2008లో ఇదే రోజున భారీ ఉగ్రదాడి జరిగింది. 10 మంది ఉగ్రవాదులు ఆర్థిక రాజధానితో పాటు దేశాన్ని వణికించారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబై చేరుకుని మారణహోమానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో 166 మందిని చంపారు. 300 మంది ఈ దాడుల్లో గాయపడ్డారు.
ఐకానిక్ తాజ్ మరియు ఒబెరాయ్ హోటల్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్లను లక్ష్యంగా చేసుకుని వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిలీలు, భారతీయులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు 9 మంది ఉగ్రవాదుల్ని హతమార్చగా.. కసబ్ అనే ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడ్డాడు. 2010లో ఇతని భారత్ ఉరితీసింది.
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!