Odisha Train Accident: సిగ్నలింగ్ లోపాలపై మూడు నెలల క్రితమే అధికారి హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని నింపింది. 275 మంది ప్రయాణికులు మరణించారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇదిలా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డుతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Pawan kalyan ‘bro ‘: క్రేజీ అప్డేట్..పవన్ కళ్యాణ్ సినిమాలో చిరు హీరోయిన్..
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి మూడు నెలల ముందు ‘‘ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ’ వైఫల్యాన్ని ఓ ఉన్నతాధికారి గుర్తించారు. నైరుతి రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు. దీనికి అంతకుముందు రోజు జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదాన్ని గురించి లేఖలో ప్రస్తావించారు. ఆ రోజు అప్ మెయిన్ లైన్ లో వెళ్లేందుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్ మెయిన్ లైన్ వెళ్లేలా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండటాన్ని లోకో పైలెట్ గమనించి రైలును ఆపేశాడు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఈ ఉదంతం తెలుపుతోందని లేఖలో ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో సిగ్నల్ ప్రకారం వెళ్లాల్సిన రైలు ట్రాక్ మారిపోతోందని, ఈ వైఫల్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే విధంగా జరిగితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని లేఖలో హెచ్చరించారు.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!