Presidential Polls: ఒడిశా సీఎం కీలక ప్రకటన.. మద్దతుపై తేల్చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి? అనే విషయంపై తేల్చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.. సోషల్ మీడియాలో వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నవీన్ పట్నాయక్.. తమ రాష్ట్రానికి చెందిన శ్రీమతి ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఒడిశా శాసనసభ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలందరినీ కోరారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. మరోవైపు, విపక్షాలు బరిలోకి దింపిన యశ్వంత్ సిన్హాకు దేశవ్యాప్తంగా 22 పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Maharashtra Political Crisis: ఉద్ధవ్ థాక్రే రాజీనామా..?
Also Read
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
కాగా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికలకు ఒడిశా గిరిజన నేత ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించింది.. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి.. బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత 64 ఏళ్ల ముర్ము, జార్ఖండ్ మాజీ గవర్నర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అత్యున్నత రాజ్యాంగ పదవిని ఆక్రమించిన మొదటి గిరిజన మహిళగా రికార్డు సృష్టించనున్నారు.. ఇక, ద్రౌపది ముర్ము తనను ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.. మీడియాతో మాట్లాడిన ద్రౌపది ముర్ము.. తానను ఎన్డీఏ అత్యున్నత పదవికి నామినేట్ చేసిన విషయాన్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయాయన్నారు.. ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉన్నాను.. మారుమూల మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ అయిన నేను అత్యున్నత పదవికి అభ్యర్థి కావాలని అనుకోలేదని రాయ్రంగ్పూర్ తన నివాసంలో మీడియాతో వ్యాఖ్యానించారు.
Appeal all the members of Odisha Legislative Assembly, cutting across party lines, to extend unanimous support to elect the daughter of #Odisha – Smt #DraupadiMurmu to the country’s highest office.
— Naveen Patnaik (@Naveen_Odisha) June 22, 2022
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..