Presidential Polls: ఒడిశా సీఎం కీలక ప్రకటన.. మద్దతుపై తేల్చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి? అనే విషయంపై తేల్చేశారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.. సోషల్ మీడియాలో వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నవీన్ పట్నాయక్.. తమ రాష్ట్రానికి చెందిన శ్రీమతి ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఒడిశా శాసనసభ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలందరినీ కోరారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. మరోవైపు, విపక్షాలు బరిలోకి దింపిన యశ్వంత్ సిన్హాకు దేశవ్యాప్తంగా 22 పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Maharashtra Political Crisis: ఉద్ధవ్ థాక్రే రాజీనామా..?
Also Read
- Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
- Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
- Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
కాగా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికలకు ఒడిశా గిరిజన నేత ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించింది.. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి.. బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత 64 ఏళ్ల ముర్ము, జార్ఖండ్ మాజీ గవర్నర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అత్యున్నత రాజ్యాంగ పదవిని ఆక్రమించిన మొదటి గిరిజన మహిళగా రికార్డు సృష్టించనున్నారు.. ఇక, ద్రౌపది ముర్ము తనను ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.. మీడియాతో మాట్లాడిన ద్రౌపది ముర్ము.. తానను ఎన్డీఏ అత్యున్నత పదవికి నామినేట్ చేసిన విషయాన్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయాయన్నారు.. ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉన్నాను.. మారుమూల మయూర్భంజ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ అయిన నేను అత్యున్నత పదవికి అభ్యర్థి కావాలని అనుకోలేదని రాయ్రంగ్పూర్ తన నివాసంలో మీడియాతో వ్యాఖ్యానించారు.
Appeal all the members of Odisha Legislative Assembly, cutting across party lines, to extend unanimous support to elect the daughter of #Odisha – Smt #DraupadiMurmu to the country’s highest office.
— Naveen Patnaik (@Naveen_Odisha) June 22, 2022
తాజావార్తలు
-
Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
-
AIG Hospitalలో బాలయ్య.. ఈ రాత్రే సర్జరీ జరిగే అవకాశం?
-
Rajnath Singh: విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటారా? విపక్షాలపై రాజ్నాథ్సింగ్ ఫైర్
-
Main Wapas Aaunga: హైదరాబాద్ థియేటర్లలో ‘మైన్ వాపస్ ఆవుంగా’ డైరెక్టర్
-
Akhilesh Yadav: ప్రభుత్వంతో డీల్..? కాంగ్రెస్ తీరుపై అఖిలేష్ అనుమానాలు..
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!