Arvind Kejriwal: కేజ్రీవాల్ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ని ఈ కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడమే కాకుండా..ఆయనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఆప్ ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ని ఢిల్లీ లిక్కర్ కేసులో అక్టోబర్ 4న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన మూడో వ్యక్తి సంజయ్ సింగ్. అంతకుముందు ఢిల్లీ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్, ఆ తరువాత ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వారు మాజీలుగా ఉన్నారు. మరోవైపు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు నవంబర్ 24 వరకు పొడగించింది. పార్లమెంట్ సభ్యుడిగా అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు న్యాయమూర్తి అనుమతించారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: BY Vijayendra Yediyurappa: కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్గా యడియూరప్ప కుమారుడు..
ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఈడీ సమన్లు పంపింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రగా కేజ్రీవాల్ విమర్శించారు. అయితే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నిలక ముందు బీజేపీ విపక్షాల నేతల్ని ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈడీ ఈ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా చేయాలా..? లేక ప్రభుత్వాన్ని కొనసాగించాలా..? అనే దానిపై ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రిఫరెండం నిర్వహిస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. అయితే రెఫరెండానికి ఎలాంటి తేదీని ఖరారు చేయలేదు. ఈ కేసులో ఈడీతో పాటు సీబీఐ కూడా విచారిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!