Nora Fatehi: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నోరా ఫతేహిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi: జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహి గురువారం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ముందు హాజరయ్యారు. నోరా ఫతేహీ ఇవాళ ఉదయమే మందిర్ మార్గ్లోని ఢిల్లీ పోలీస్ ఈఓడబ్ల్యూ కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారించిన ఒక రోజు అనంతరం నోరా ఫతేహీ విచారిస్తున్నారు.
అంతకుముందు సెప్టెంబర్ 2న నోరా ఫతేహిని అధికారులు తొమ్మిది గంటలకు పైగా విచారించారు. దాదాపు 50 ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నోరా ఫతేహి దర్యాప్తుకు సహకరించారని.. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని అధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు అందుకున్న వ్యక్తులకు నేరంలో ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని ఆయన వెల్లడించారు.
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బీజేపీ
గతంలో విచారణకు హాజరైన ఫతేహీ.. బహుమతులు తీసుకున్నానని, కానీ అతనికి నేర సంబంధాలు ఉన్నాయని తనకు తెలియదని అధికారులకు తెలిపింది. సుఖేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న నోరా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు ఒకరికొకరు బహుమతులు అందుకుంటున్న విషయం తెలియదని ఇప్పటివరకు ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ 2021లో ఈడీ ఫతేహి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది, అక్కడ ఆరోపించిన నేరస్థుడు, అతని నటుడు భార్య లీనా నుండి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించింది.
మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలు బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!