Nora Fatehi: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నోరా ఫతేహిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi: జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహి గురువారం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ముందు హాజరయ్యారు. నోరా ఫతేహీ ఇవాళ ఉదయమే మందిర్ మార్గ్లోని ఢిల్లీ పోలీస్ ఈఓడబ్ల్యూ కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారించిన ఒక రోజు అనంతరం నోరా ఫతేహీ విచారిస్తున్నారు.
అంతకుముందు సెప్టెంబర్ 2న నోరా ఫతేహిని అధికారులు తొమ్మిది గంటలకు పైగా విచారించారు. దాదాపు 50 ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నోరా ఫతేహి దర్యాప్తుకు సహకరించారని.. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని అధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు అందుకున్న వ్యక్తులకు నేరంలో ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని ఆయన వెల్లడించారు.
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బీజేపీ
గతంలో విచారణకు హాజరైన ఫతేహీ.. బహుమతులు తీసుకున్నానని, కానీ అతనికి నేర సంబంధాలు ఉన్నాయని తనకు తెలియదని అధికారులకు తెలిపింది. సుఖేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న నోరా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు ఒకరికొకరు బహుమతులు అందుకుంటున్న విషయం తెలియదని ఇప్పటివరకు ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ 2021లో ఈడీ ఫతేహి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది, అక్కడ ఆరోపించిన నేరస్థుడు, అతని నటుడు భార్య లీనా నుండి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించింది.
మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలు బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!