Nora Fatehi: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నోరా ఫతేహిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi: జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహి గురువారం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ముందు హాజరయ్యారు. నోరా ఫతేహీ ఇవాళ ఉదయమే మందిర్ మార్గ్లోని ఢిల్లీ పోలీస్ ఈఓడబ్ల్యూ కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారించిన ఒక రోజు అనంతరం నోరా ఫతేహీ విచారిస్తున్నారు.
అంతకుముందు సెప్టెంబర్ 2న నోరా ఫతేహిని అధికారులు తొమ్మిది గంటలకు పైగా విచారించారు. దాదాపు 50 ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నోరా ఫతేహి దర్యాప్తుకు సహకరించారని.. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని అధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. సుకేష్ చంద్రశేఖర్ నుంచి బహుమతులు అందుకున్న వ్యక్తులకు నేరంలో ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని ఆయన వెల్లడించారు.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బీజేపీ
గతంలో విచారణకు హాజరైన ఫతేహీ.. బహుమతులు తీసుకున్నానని, కానీ అతనికి నేర సంబంధాలు ఉన్నాయని తనకు తెలియదని అధికారులకు తెలిపింది. సుఖేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్న నోరా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు ఒకరికొకరు బహుమతులు అందుకుంటున్న విషయం తెలియదని ఇప్పటివరకు ప్రశ్నించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సెప్టెంబర్-అక్టోబర్ 2021లో ఈడీ ఫతేహి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది, అక్కడ ఆరోపించిన నేరస్థుడు, అతని నటుడు భార్య లీనా నుండి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించింది.
మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలు బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?