Noida: పనిలో నిర్లక్ష్యం.. ఉద్యోగులకు సీఈవో ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..!
- నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఉద్యోగుల నిర్లక్ష్యం
- ఉద్యోగులకు సీఈవో పనిష్మెంట్
- 20 నిమిషాలు పాటు నిల్చొని పని చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంపెనీ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. నిబంధనలు మీరితే.. యాజమాన్యం ఏ చర్యలకైనా ఉపక్రమిస్తుంది. తాజాగా నోయిడాలో జరిగిన ఘటన వార్తల్లో నిలిచింది. కంపెనీ రూల్స్ అతిక్రమించినందుకు సీఈవో.. ఉద్యోగులకు పనిష్మెంట్ విధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పని నిమిత్తం కార్యాలయంలోకి వచ్చిన ఓ వృద్ధుడికి ఉద్యోగులు అసౌకర్యం కల్పించారు. అంతే ఈ ఘటనపై కంపెనీ సీఈవో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూల్లో పిల్లలకు శిక్ష విధించినట్లుగా.. ఉద్యోగులకు శిక్ష విధించారు. 20 నిమిషాల పాటు నిలబడి పని చేయాలంటూ దండించారు. దీంతో ఉద్యోగులంతా 20 నిమిషాల పాటు నిలబడి పని చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
ఇది కూడా చదవండి: Bihar: 12 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం.. ఆ తర్వాత కొట్టి చంపి
ఉత్తరప్రదేశ్లోని న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన కార్యాలయంలో సుమారు 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ పనుల మీద నోయిడా ప్రజలు వస్తుంటారు. ఈ అథారిటీకి గత ఏడాది సీఈఓగా ఐఏఎస్ అధికారి డాక్టర్ లోకేశ్ నియమితులయ్యారు. అయితే ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా సహించరు. ఇక వృద్ధులను ఎక్కువసేపు నిలబెట్టకుండా చూడాలని హెచ్చరిస్తుంటారు. అందుకోసం సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సిబ్బంది పనితీరును గమనిస్తుంటారు. అయితే సోమవారం ఒక వృద్ధుడు కౌంటర్ దగ్గర నిలబడి ఉండటాన్ని కెమెరాలో చూశారు. ఆయన పనేంటో చూడాలని వెంటనే మహిళా ఉద్యోగికి సూచించారు. అయినా కూడా 20 నిమిషాల తర్వాత కూడా అదే కౌంటర్ దగ్గర వృద్ధుడు నిలబడి ఉండటాన్ని సీఈవో గమనించారు. దీంతో వెంటనే కార్యాలయం దగ్గరకు వచ్చి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 20 నిమిషాల పాటు నిల్చోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సీఈవో తీరును ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. మిస్టరీగా ఆడియో రికార్డ్!
Noida Authority CEO Lokesh Sets an Example
When an elderly couple's file was ignored, he made staff work standing for 30 minutes as a penalty. Swift action like this against negligence is truly admirable @CeoNoida @CMOfficeUP @myogiadityanath pic.twitter.com/n4B44ftB79— Privesh Pandey (@priveshpandey) December 17, 2024
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!