Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు మరో దెబ్బ
- సెన్సార్ బోర్డు వద్ద అడ్డంగులు ఎదుర్కొన్న ఎమర్జెన్సీ
- బంగ్లాదేశ్ లో ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం
- ఆదేశాలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్లో ఫైర్బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. తను తాజాగా మాజీ భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా `ఎమర్జెన్సీ`.. ఈ సినిమా అతి త్వరలో రిలీజ్కు సిద్ధం అవుతుంది. సెన్సార్ బోర్డ్ వద్ద ఈ సినిమా చాలా అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఎమర్జెన్సీ ఎట్టకేలకు కొన్ని కట్స్ తో విడుదలకు రెడీ అవుతుంది. అయితే రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సినిమాను బంగ్లాదేశ్లో నిషేధించారు. తాజా మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్లో `ఎమర్జెన్సీ` ప్రదర్శనను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ దీనికి కారణం కాదు.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ అనైక్యతే దీనికి కారణం. భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న సంబంధాలకు సంబంధించిన వ్యవహారమిది.
Read Also:Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 184 విమానాలు..
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ఎమర్జెన్సీ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితకథ. ఇందిర కథలో బంగ్లాదేశ్ కి స్థానం ఉంది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విడదీయడంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారు. 1971 యుద్ధంలో భారతదేశం పాల్గొనడంతో చివరికి అది బంగ్లాదేశ్ ఏర్పాటుకు పరిస్థితి దారితీసింది. అత్యవసర పరిస్థితిలో 1971 బంగ్లాదేశ్ స్వాత్వంత్ర్య యుద్ధంలో భారత సైన్యం, గాంధీ ప్రభుత్వ పాత్రను బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ ఎంతగానో కీర్తించారు. రెహమాన్తో ఇందిరా గాంధీ గొప్ప సత్సంబంధాలను కొనసాగించారు. భారతదేశం పాకిస్తాన్పై యుద్ధంలో గెలిచిన తర్వాత “ఇందిరా గాంధీ దేవత దుర్గా“ అని రెహాన్ సంబోధించారు. యుద్ధ సమయంలో ఆయనకు భారతదేశం నుండి మంచి సపోర్టు లభించింది. ఇది అత్యవసర పరిస్థితిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇందిర ప్రమేయం కారణంగా తీవ్రవాదులు ఆయనను ఇంట్లోనే హత్య చేశారు. చాలా కాలంగా బంగ్లాదేశ్ తో ఇండియా సంబంధాలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. అందుకే ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమాని బంగ్లాదేశ్ లో రిలీజ్ చేయకూడదని ఆక్షంలు విధించారు.
Read Also:Army Day 2025: ఆర్మీ పదవుల్లో ఉన్న భారత క్రీడాకారులు ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!