Emergency : కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాకు మరో దెబ్బ
- సెన్సార్ బోర్డు వద్ద అడ్డంగులు ఎదుర్కొన్న ఎమర్జెన్సీ
- బంగ్లాదేశ్ లో ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం
- ఆదేశాలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం
Emergency : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నటిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తనకు తప్పు అనిపిస్తే ఎంత పెద్ద వారినైన ఎదిరించి మాట్లాడుతుంది. అందుకనే ఆమెని బాలీవుడ్లో ఫైర్బ్రాండ్ కంగనా అని కూడా పిలుస్తారు. తను తాజాగా మాజీ భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా రూపొందిన పొలిటికల్ డ్రామా `ఎమర్జెన్సీ`.. ఈ సినిమా అతి త్వరలో రిలీజ్కు సిద్ధం అవుతుంది. సెన్సార్ బోర్డ్ వద్ద ఈ సినిమా చాలా అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఎమర్జెన్సీ ఎట్టకేలకు కొన్ని కట్స్ తో విడుదలకు రెడీ అవుతుంది. అయితే రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సినిమాను బంగ్లాదేశ్లో నిషేధించారు. తాజా మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్లో `ఎమర్జెన్సీ` ప్రదర్శనను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ దీనికి కారణం కాదు.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ అనైక్యతే దీనికి కారణం. భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న సంబంధాలకు సంబంధించిన వ్యవహారమిది.
Read Also:Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 184 విమానాలు..
Also Read
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
- DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
ఎమర్జెన్సీ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితకథ. ఇందిర కథలో బంగ్లాదేశ్ కి స్థానం ఉంది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విడదీయడంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారు. 1971 యుద్ధంలో భారతదేశం పాల్గొనడంతో చివరికి అది బంగ్లాదేశ్ ఏర్పాటుకు పరిస్థితి దారితీసింది. అత్యవసర పరిస్థితిలో 1971 బంగ్లాదేశ్ స్వాత్వంత్ర్య యుద్ధంలో భారత సైన్యం, గాంధీ ప్రభుత్వ పాత్రను బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ ఎంతగానో కీర్తించారు. రెహమాన్తో ఇందిరా గాంధీ గొప్ప సత్సంబంధాలను కొనసాగించారు. భారతదేశం పాకిస్తాన్పై యుద్ధంలో గెలిచిన తర్వాత “ఇందిరా గాంధీ దేవత దుర్గా“ అని రెహాన్ సంబోధించారు. యుద్ధ సమయంలో ఆయనకు భారతదేశం నుండి మంచి సపోర్టు లభించింది. ఇది అత్యవసర పరిస్థితిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇందిర ప్రమేయం కారణంగా తీవ్రవాదులు ఆయనను ఇంట్లోనే హత్య చేశారు. చాలా కాలంగా బంగ్లాదేశ్ తో ఇండియా సంబంధాలు చెప్పుకోదగ్గ విధంగా లేవు. అందుకే ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమాని బంగ్లాదేశ్ లో రిలీజ్ చేయకూడదని ఆక్షంలు విధించారు.
Read Also:Army Day 2025: ఆర్మీ పదవుల్లో ఉన్న భారత క్రీడాకారులు ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
-
Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
-
DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
-
Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!