NITI Aayog: నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. హాజరుకానున్న సీఎంలు
- నేడు మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
- హాజరుకానున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. “వికసిత్ రాజ్య, వికసిత్ భారత్-2047” ఇతివృత్తం (థీమ్)గా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాల ముుఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Germany: రైల్వే స్టేషన్లో కత్తితో మహిళ వీరంగం.. 12 మందికి తీవ్రగాయాలు
Also Read
ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు. నీతి ఆయోగ్ ఛైర్ పర్సన్గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Tamannaah : అమ్మ నాన్న మాట వినకపోవడం మంచిదైంది..
భారత దేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి (2047 సంవత్సరం) భారత్ను అభివృద్ధి చెందిన దేశం (వికసిత్ భారత్) గా ఆవిష్కృతం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయి లక్ష్యానికి, రాష్ట్రాల ఆకాంక్షలను కూడా జోడించడం, సహకార సమాఖ్య వాదం (ఫెడరిలిజం)ను మరింతగా దృడపరుచుకోవడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. శక్తివంతమైన దేశంగా భారత్ను రూపొందించుకునేందుకు కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!