Himanta Biswa Sarma: అస్సాంలో మదర్సాలను మూసివేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New India Does Not Need Madrassas Says Himanta Biswa Sarma: అస్సాంలో ముస్లిం మత పాఠశాలలైన మదర్సాలన్నింటినీ ముసివేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం ఏమాత్రం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మనకి మదర్సాల అవసరం లేదని, ఇంజినీర్లు & డాక్లర్ల అవసరం ఉందని చెప్పారు. మదర్సాల కంటే మన భారతదేశానికి , అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉందని పేర్కొన్నారు.
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్పై ప్రపంచ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశామని, మిగతా వాటిని కూడా క్రమంగా మూసేస్తామని హిమంత బిశ్వ శర్మ అన్నారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న జనంతో.. మన భారత సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలామంది ఉన్నారు కానీ.. హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. వీటిపై రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.
Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది
కాగా.. అస్సాంలో ప్రస్తుతం 3,000 నమోదిత, నమోదుకాని మదర్సాలు ఉన్నాయి. గతంలో హిమంత బిశ్వ శర్మ మదర్సాలను తగ్గించాలని లేదా మదర్సాలలో ఇస్తున్న విద్యను పరిశీలించాలని సూచించారు. 2020లో అన్ని ప్రభుత్వ మదర్సాలను ‘రెగ్యులర్ స్కూల్స్’గా మార్చడానికి వీలు కల్పించే చట్టాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. విద్య పట్ల సానుకూల దృక్పథం ఉన్న బెంగాలీ ముస్లింలతో.. మదర్సాలలో ‘మంచి వాతావరణాన్ని’ సృష్టించేందుకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. మదర్సాలలో సైన్స్, గణితం కూడా సబ్జెక్టులుగా బోధించబడుతుందని.. విద్యాహక్కు గౌరవం, ఉపాధ్యాయుల డేటాబేస్ నిర్వహించబడుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!