Indian Navy: కరాచీతో సహా చాలా లక్ష్యాలను ఇండియన్ నేవీ టార్గెట్ చేసింది..
- కరాచీతో సహా అనేక టార్గెట్లను ఫిక్స్ చేశాం..
- ఉగ్రదాడి తర్వాత 96 గంటల్లోనే వ్యూహాలతో సిద్ధం..
- ఆపరేషన్ సిందూర్పై వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఈ రోజు త్రివిధ దళాల అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత అరేబియన్ సముద్రంలో భారత నేవీని మోహరించినట్లు వెల్లడించారు. కరాచీతో సహా సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేందుకు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు నేవీ వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు. ‘‘”మనం ఎంచుకున్న సమయంలో కరాచీతో సహా సముద్రంలో, భూమిపై ఎంపిక చేసిన లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సంసిద్ధత, సామర్థ్యంతో అరేబియన్ సముద్రంలో మా దళాలు ముందుకు మోహరించబడ్డాయి’’ అని ఆపరేషన్ సిందూర్ త్రివధ దళాల సంయుక్త సమావేశంలో చెప్పారు.
Read Also: India Pakistan War: ఎయిర్ బేస్లపై దాడితో పాకిస్తాన్లో భయం.. ఆ తర్వాతే చర్చల ప్రతిపాదన..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఆపరేషన్ సిందూర్తో ఆర్మీ, వైమానిక దళం గగనతలం, నేలపై నుంచి ఖచ్చితమైన దాడులు చేయడం ప్రారంభించాయని, నేవీ కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పారు. ఇండియన్ నేవీ మోహరించడంతో పాకిస్తాన్ రక్షణాత్మక వైఖరితో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ సమయంలో అరేబియా సముద్రంలో నావికా దళం మోహరించడంతో పాక్ నేవీ దాదాపుగా ఒడరేవు లేదా తీరానికి సమీపంలో ఉండాల్సి వచ్చిందని చెప్పారు.
పహల్గామ్ దాడి జరిగిన వెంటనే నేవీ తన యుద్ధ బృందాలు, జలంతర్గాముల్ని, నేవీ నౌకల్ని మోహరించినట్లు చెప్పారు. పూర్తి పోరాట సంసిద్ధతతో మోహరించామని వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు. ఉగ్రవాద దాడులు జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో వ్యూహాలతో మోహరించినట్లు చెప్పారు. ఎంచుకున్న లక్ష్యాలపై దాడుల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. భారత్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ కైనెటిక్ చర్యల వల్లే పాకిస్తాన్ కాల్పుల విరమణను అభ్యర్థించిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!