Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Vs Pakistan Match Difficult Says Ehsan Mani Icc Pcb Talks T20 World Cup

Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!

Published Date :February 8, 2026 , 11:39 am
By RAMAKRISHNA KENCHE
Former ICC Chairman Ehsan Mani: “మాట్లాడండి.. బయపెట్టకండి”.. అలా ఐతే భారత్-పాక్ మ్యాచ్ కష్టమే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Former ICC chairman Ehsan Mani: టీ20 వరల్డ్ కప్‌ సమరం మొదలైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్-భారత్ మ్యాచ్ అంశంపై ఇంకా క్లారిటీ లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఐసీసీ టోర్నీలకు పెద్ద ఆదాయ వనరు. ఈ అంశంపై ప్రస్తుతం పీబీసీ-ఐసీసీ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహం మొదలైంది. నిన్నటి వరకు తెరవెనుక చర్చలకు స్వస్తి పలికిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా అధికారికంగా చర్చల బాట పట్టాయి. అయినా కూడా ఈ సమస్య తేలికగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదని మాజీ ఐసీసీ ఛైర్మన్ ఎహ్సాన్ మని చెప్పడం అభిమానుల్లో ఆందోళన పెంచింది. ఈ వివాదానికి ఒక్కరినే నిందించలేమని ఆయన స్పష్టం చేశాడు. అయితే రాజకీయ జోక్యమే ఈ మొత్తం గందరగోళానికి ప్రధాన కారణమని తెలిపాడు. భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాకిస్థాన్‌ నిర్ణయం కోపం, నిరాశతో తీసుకున్నదని అంగీకరించాడు.

READ MORE: AFg vs NZ T20 WC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన కివీస్

Also Read

  • DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..
  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
  • RCB Vs DC: విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే.. 

Revsportz‌తో మాట్లాడిన ఎహ్సాన్ మని.. తాను ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. “నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే, తప్పకుండా పరిష్కారం కోసం ప్రయత్నించేవాడిని. ఏ జట్టునీ టోర్నీ నుంచి బయటకు నెట్టేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. పీసీబీ ఒక వైఖరి తీసుకుంది. కానీ మాట్లాడకుండా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చదు. బెదిరింపుల కంటే చర్చలే ముఖ్యం” అని మని అన్నాడు. అయితే ఈ ప్రయత్నం ఒక్క వైపు నుంచే కాకుండా రెండు వైపుల నుంచీ రావాల్సిందని స్పష్టం చేశాడు. జై షా నేతృత్వంలో ఐసీసీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి దాదాపు అందరూ మద్దతిచ్చారని, అందులో పాకిస్థాన్‌ మాత్రమే భిన్నంగా ఆలోచించిందని మని గుర్తు చేశాడు. సాధారణంగా బోర్డు నిర్ణయాలను అంగీకరించాల్సిందేనని చెప్పినప్పటికీ, పీసీబీ మాత్రం ఇది అన్యాయంగా, రాజకీయ ప్రభావంతో తీసుకున్న నిర్ణయంగా భావించిందని వివరించాడు. ఈ విషయం మొదట్లోనే పరిష్కరించి ఉండాల్సిందని, జై షా, నక్వీ నేరుగా మాట్లాడుకుని ఉంటే ఇంత దూరం వెళ్లేదే కాదని అభిప్రాయపడ్డాడు. పీసీబీ ఈ స్థానం తీసుకోవడానికి కారణం.. తమను పట్టించుకోవట్లేదనే భావనని మని చెప్పాడు. ఇప్పటికీ కొద్దిపాటి ఆశ మిగిలే ఉందని చెప్పినప్పటికీ, అది నిజం కావాలంటే అత్యున్నత స్థాయిలోనే చర్చలు జరగాలని స్పష్టం చేశాడు. “ఛైర్మన్ స్థాయిలో నేరుగా మాట్లాడితే తప్ప ఈ సమస్య తీరుతుందని నేను అనుకోవడం లేదు. జై షా స్వయంగా పాకిస్థాన్‌‌కు వెళ్లి మాట్లాడేందుకు ముందుకొచ్చి ఉంటే, అది చాలా మంచి సంకేతం అయ్యేది. నా కాలంలో నేను భారత క్రీడా మంత్రులతోనూ నేరుగా మాట్లాడాను” అని గుర్తు చేశాడు.

READ MORE: Jr NTR : ‘డ్రాగన్’ వేట మొదలైంది.. ఎన్టీఆర్.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ehsan Mani comments ICC
  • ICC PCB talks India Pakistan
  • ICC tournament revenue India Pakistan
  • India Pakistan cricket controversy
  • India Pakistan cricket politics

తాజావార్తలు

  • DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..

  • Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?

  • Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!

  • AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!

  • CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!

ట్రెండింగ్‌

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions