Supreme Court: తెల్లవారుజామున ఘటన, రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్.? కోల్కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సీరియస్..
- కోల్కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ..
- బెంగాల్ ప్రభుత్వం.. పోలీసులు లోపాలను ఎత్తి చూపిన సీజేఐ..
- తెల్లవారుజామున ఘటన..రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రెకెత్తించింది. ‘‘పాతుకుపోయిన పితృస్వామ్య పక్షపాతం కారణంగా మహిళా వైద్యులు ఎక్కువగా లక్ష్యమవుతున్నారు. వైద్యవృత్తులు హింసకు గురవుతున్నాయి. ఎక్కువ మంది మహిళలు వర్క్ఫోర్స్లో చేరినందున, పరిస్థితులు మారడం కోసం దేశం మరొక అత్యాచారం కోసం వేచి ఉండదు’’ అని చంద్రచూడ్ అన్నారు.
అయితే, ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేయడంపై, కేసుని నిర్వహించడంతో నిర్లక్ష్యం, లోపాలపై బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం, ఆస్పత్రి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పోలీసుల చర్యలకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. మృతదేహానికి దహన సంస్కారాలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు..? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
Also Read
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
Read Also: Hanuman In USA: వావ్.. అమెరికాలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట..
‘‘ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు..? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు.?? మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు, పోలీసుల ఏం చేస్తున్నారు..? తీవ్రమైన నేరం జరిగింది, క్రైమ్ సీన్ హస్పిటల్లో ఉంది.. వారు ఏం చేస్తున్నారు..? విధ్వంసకులను ఆస్పత్రిలోకి ప్రవేశిస్తారా..? అని చంద్రచూడ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించారు. బెంచ్ ప్రశ్నలకు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. హాస్పిటల్ వ్యక్తులు ఫోటోలు తీశారని, అసహజ మరణానికి సంబంధించిన కేసు వెంటనే ప్రారంభించారని చెప్పారు. ముఖ్యంగా బాధితురాలి తల్లిదండ్రులు గైర్హాజరైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆస్పత్రి ప్రధాన విధి అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.
జస్టిస్ పార్దీవాలా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయం గురించి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మొదటి ఇన్ఫార్మర్ ఎవరు..? ఎఫ్ఐఆర్ నమోదైన టైమ్ ఎంత..?, అని ప్రశ్నించారు. బాధితురాలి తండ్రి అని, అతను రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున వాదిస్తున్న సిబల్ చెప్పారు. రాత్రి 8.30 గంటలకు బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారాలు చేసిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1.45 నుంచి 4.00 గంటల మధ్య పోస్టుమార్టం నివేదిక హత్య అని తేల్చింది. అయితే, ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. ఆ సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్, ఆస్పత్రి బోర్డు ఏం చేస్తున్నారు..? అని సీజేఐ ప్రశ్నించారు.
బాధితురాలి పేరు, ఫోటోలు మీడియాలో రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది యువవైద్యులు 36 గంటలు పనిచేస్తున్నారని, సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి మేము జాతీయ ప్రోటోకాల్ని రూపొందించాలని కోర్టు పేర్కొంది. నేరం తెల్లవారుజామున జరిగితే దానిని ఆత్మహత్యగా మార్చడానికి ప్రిన్సిపాల్ ప్రయత్నించాడని కోర్టు పేర్కొంది. మరోవైపు ఘటన సమయంలో ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్ని సీబీఐ మూడు రోజలుగా ప్రశ్నిస్తోంది. ఘటన సమయంలో ప్రిన్సిపాల్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి రాజీనామా చేసిన తర్వాత, కలకత్తా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమమించడం ఏంటని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!