Maha Kumbh Mela from space: “వెలిగిపోతున్న కుంభ మేళా”.. అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి ఫోటో..
- ఆకాశం నుంచి అద్భుతంగా కుంభ మేళా..
- అంతరిక్ష నుంచి ఫోటో తీసిన నాసా వ్యోమగామి..
- కుంభమేళా వెలిగిపోతుందంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు ఒకే చోటకు చేరడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. చివరకు పాకిస్తాన్, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా కుంభ మేళ గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ అద్భుతమైన జనసమాగమం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను కూడా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసాకు చెందిన వ్యోమగామి డాన్ పెటిట్ కుంభమేళని ఫోటో తీశారు. 400 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ఐఎస్ఎస్ నుంచి తీసిన ఫోటోలో ప్రయాగ్ రాజ్, ముఖ్యంగా కుంభమేళా జరుగుతున్న ప్రదేశం ‘‘ వెలిగిపోతోంది’’. ‘‘2025 మహా కుంభమేళా గంగా నది తీర్థయాత్ర రాత్రిపూట ISS నుంచి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం బాగా వెలిగిపోతుంది’’ అంటూ ఎక్స్లో తన ఫోటోలను పోస్ట్ చేశారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Olive Ridley turtles: చెన్నై తీరంలో వేల సంఖ్యలో ‘‘ఆలివ్ రిడ్లే తాబేళ్ల’’ మృతి..
ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి భారీగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. తాజాగా నాసా వ్యోమగామి ఫోటో వైరల్గా మారింది. ఇది ఒక “సూపర్ నోవా”ను గుర్తు చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘వావ్ విజువల్స్ అద్భుతం’’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
యూపీ సర్కార్ కుంభమేళ కోసం 24 గంటల పాటు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంది. రూ. 400 కోట్లతో 182 కి.మీ హై టెన్షన్ లైన్స్, 40,000 రీ ఛార్జబుల్ బల్బులు, త్రివేణి సంగమం వద్ద 2700 సీసీటీవీ కెమెరాలు, నీటిలో ప్రయాణించే డ్రోన్లు, ఏఐ ఆధారిత భద్రతా చర్యల్ని ఏర్పాటు చేసింది.
2025 Maha Kumbh Mela Ganges River pilgrimage from the ISS at night. The largest human gathering in the world is well lit. pic.twitter.com/l9YD6o0Llo
— Don Pettit (@astro_Pettit) January 26, 2025
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!