Maha Kumbh Mela from space: “వెలిగిపోతున్న కుంభ మేళా”.. అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి ఫోటో..
- ఆకాశం నుంచి అద్భుతంగా కుంభ మేళా..
- అంతరిక్ష నుంచి ఫోటో తీసిన నాసా వ్యోమగామి..
- కుంభమేళా వెలిగిపోతుందంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు ఒకే చోటకు చేరడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కుంభమేళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. చివరకు పాకిస్తాన్, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాల్లో కూడా కుంభ మేళ గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ అద్భుతమైన జనసమాగమం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములను కూడా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి నాసాకు చెందిన వ్యోమగామి డాన్ పెటిట్ కుంభమేళని ఫోటో తీశారు. 400 కి.మీ ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న ఐఎస్ఎస్ నుంచి తీసిన ఫోటోలో ప్రయాగ్ రాజ్, ముఖ్యంగా కుంభమేళా జరుగుతున్న ప్రదేశం ‘‘ వెలిగిపోతోంది’’. ‘‘2025 మహా కుంభమేళా గంగా నది తీర్థయాత్ర రాత్రిపూట ISS నుంచి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశం బాగా వెలిగిపోతుంది’’ అంటూ ఎక్స్లో తన ఫోటోలను పోస్ట్ చేశారు.
Also Read
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
Read Also: Olive Ridley turtles: చెన్నై తీరంలో వేల సంఖ్యలో ‘‘ఆలివ్ రిడ్లే తాబేళ్ల’’ మృతి..
ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి భారీగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. తాజాగా నాసా వ్యోమగామి ఫోటో వైరల్గా మారింది. ఇది ఒక “సూపర్ నోవా”ను గుర్తు చేస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘వావ్ విజువల్స్ అద్భుతం’’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
యూపీ సర్కార్ కుంభమేళ కోసం 24 గంటల పాటు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంది. రూ. 400 కోట్లతో 182 కి.మీ హై టెన్షన్ లైన్స్, 40,000 రీ ఛార్జబుల్ బల్బులు, త్రివేణి సంగమం వద్ద 2700 సీసీటీవీ కెమెరాలు, నీటిలో ప్రయాణించే డ్రోన్లు, ఏఐ ఆధారిత భద్రతా చర్యల్ని ఏర్పాటు చేసింది.
2025 Maha Kumbh Mela Ganges River pilgrimage from the ISS at night. The largest human gathering in the world is well lit. pic.twitter.com/l9YD6o0Llo
— Don Pettit (@astro_Pettit) January 26, 2025
తాజావార్తలు
-
He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
-
Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
-
Mega 158: డాడీ కోసం పెద్ది!
-
PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!