Gujarat polls: నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషి కుమార్తెకు బీజేపీ టికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naroda Patiya riots case convict’s daughter gets BJP ticket to fight Gujarat polls: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీజేపీతో పాటు పలు కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. టికెట్ల కేటాయింపులో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టికెట్ కేటాయించింది. ఇదిలా ఉంటే గుజరాత్ మోర్బీ ఘటనలో 140కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు లెక్కచేయకుండా చాలా మందిని కాపాడి మోర్బీ హీరోగా నిలిచిన కాంతీలాల్ అమృతియా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీజేపీ అందర్ని ఆశ్చర్యపరిచింది.
Read Also: Governor Tamilisai : ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపిన గవర్నర్ ట్వీట్
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇదిలా ఉంటే నరోడా పాటియా అల్లర్లలో దోషిగా ఉన్న వ్యక్తి కుమార్తెకు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ కేసులో దోషిగా ఉన్న మనోజ్ కుక్రానీ కూతురు పాయల్ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేయనున్నారు. 2002 నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషి మనోజ్ కక్రానీగా తేలాడు. ఆయనక జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం మనోజ్ బెయిల్ పై ఉన్నాడు. పాయల్ కుక్రానీ అనస్థీషియా నిపుణురాలు. బీజేపీకి చెందని అతి పిన్న వయస్కురాలు. పాయల్ తల్లి రేష్మ కుక్రానీ అహ్మదాబాద్ లోని సైజ్ పూర్ కార్పొరేటర్ గా ఉన్నారు.
పాయల్ మాట్లాడుతూ.. పార్టీ నాపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మా నాన్న బీజేపీకి 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని.. నా చదువు పూర్తయిన తర్వాత మా అమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. పాయల్ తల్లి రేష్మ తన కూతరు పాయల్ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
అయితే బీజేపీ తీరును కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ వర్మ.. బీజేపీ వేరే అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు..? బీజేపీ ఇంతకాలం నుంచి చేస్తుందే ఇదే అని బీజేపీ నకిలీ హిందుత్వం ఇప్పుడు బట్టబయలైందని.. గుజరాత్ లో బీజేపీ గెలవదంటూ అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!