Gujarat polls: నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషి కుమార్తెకు బీజేపీ టికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naroda Patiya riots case convict’s daughter gets BJP ticket to fight Gujarat polls: గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. బీజేపీతో పాటు పలు కాంగ్రెస్, ఆప్ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. డిసెంబర్ 1, 5న రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. టికెట్ల కేటాయింపులో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టికెట్ కేటాయించింది. ఇదిలా ఉంటే గుజరాత్ మోర్బీ ఘటనలో 140కి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలు లెక్కచేయకుండా చాలా మందిని కాపాడి మోర్బీ హీరోగా నిలిచిన కాంతీలాల్ అమృతియా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బీజేపీ అందర్ని ఆశ్చర్యపరిచింది.
Read Also: Governor Tamilisai : ఓ మహిళ కుటుంబంలో ఆనందం నింపిన గవర్నర్ ట్వీట్
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఇదిలా ఉంటే నరోడా పాటియా అల్లర్లలో దోషిగా ఉన్న వ్యక్తి కుమార్తెకు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ కేసులో దోషిగా ఉన్న మనోజ్ కుక్రానీ కూతురు పాయల్ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేయనున్నారు. 2002 నరోడా పాటియా అల్లర్ల కేసులో దోషి మనోజ్ కక్రానీగా తేలాడు. ఆయనక జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం మనోజ్ బెయిల్ పై ఉన్నాడు. పాయల్ కుక్రానీ అనస్థీషియా నిపుణురాలు. బీజేపీకి చెందని అతి పిన్న వయస్కురాలు. పాయల్ తల్లి రేష్మ కుక్రానీ అహ్మదాబాద్ లోని సైజ్ పూర్ కార్పొరేటర్ గా ఉన్నారు.
పాయల్ మాట్లాడుతూ.. పార్టీ నాపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మా నాన్న బీజేపీకి 40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని.. నా చదువు పూర్తయిన తర్వాత మా అమ్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. పాయల్ తల్లి రేష్మ తన కూతరు పాయల్ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
అయితే బీజేపీ తీరును కాంగ్రెస్ ప్రశ్నించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ వర్మ.. బీజేపీ వేరే అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు..? బీజేపీ ఇంతకాలం నుంచి చేస్తుందే ఇదే అని బీజేపీ నకిలీ హిందుత్వం ఇప్పుడు బట్టబయలైందని.. గుజరాత్ లో బీజేపీ గెలవదంటూ అని అన్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!