Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- ప్రియురాలి కోసం బరితెగించిన మైనర్
- ఐఫోన్ కొనేందుకు భారీ దోపిడీ
- పోలీసులకు అడ్డంగా దొరికిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలిసీతెలియని వయసులో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వ్యామోహమో.. లేదంటే బడాయి కోసమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. మీసాలు కూడా రాని వయసులోనే ప్రేమలో పడుతున్నారు. అంతటితో ఆగుతున్నారంటే అది లేదు. ప్రేయసిని మెప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది.
ఓ మైనర్కు ప్రియురాలు ఉంది. ఐఫోన్ బహుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అంతే తడువుగా చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా కొనిస్తానని మాటిచ్చాడు. అయితే ప్రేయసికి ఎలాగైనా ఐఫోన్ కొనాలని పూనుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి భారీ దోపిడీకి స్కెచ్ గీశాడు. దీనికి తన స్నేహితుల సాయం కోరాడు. అంతే తడువుగా ఓ గిడ్డంగిలో రూ.12 లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు. పాపం పండి అడ్డంగా దొరికిపోయారు.
Also Read
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
నాగ్పూర్లోని లకడ్గంజ్ ప్రాంతానికి చెందిన రాహుల్ జైచంద్కు కల్మానా ప్రాంతంలో ‘రాహుల్ సిరామిక్స్ ప్రైవేటు లిమిటెడ్’’ పేరుతో టైల్, శానిటరీ వేర్, సిపి ఫిట్టింగ్స్ గిడ్డంగి ఉంది. అయితే మే 27-28 తేదీల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు రేకుల షీట్లను తొలగించి రూ.12 లక్షల విలువైన అత్యంత ఖరీదైన శానిటరీ ఉత్పత్తులను దొంగలించారు. దీంతో రాహుల్ జైచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీరియస్గా తీసుకున్న కలమ్నా పోలీసుల దర్యాప్తు బృందం.. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తానికి మైనర్ దొంగలను పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించారు.
పోలీసులు షాక్
ఈ కేసులో ప్రధాన అనుమానితుడితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను క్షుణ్ణంగా విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దొంగతనానికి చెప్పిన కారణం తెలుసుకుని పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ కొనివ్వాలనుకున్నామని, అందుకు తమకు డబ్బు అత్యవసరమని ఒప్పుకున్నారు. ఆ కోరికతోనే గిడ్డంగిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగిలించిన విలాసవంతమైన డిజైనర్ కుళాయిలను ఒక వీధి వ్యాపారికి కేవలం 20,000 రూపాయలకే అమ్మినట్లు మైనర్లు చెప్పారు. వస్తువులను కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడు.. 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీని పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 6.5 లక్షల విలువైన విలాసవంతమైన డిజైనర్ ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!