Maharashtra: ముస్లిం మతగురువు దారుణ హత్య.. మహారాష్ట్రలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆప్ఘనిస్తాన్ కు చెందిన ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా యోలా పట్టణంలో చోటు చేసుకుంది. ఆప్థనిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల మత గురువును యోలా పట్టణంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్ లో మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. హతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించారు. ఆ ప్రాంతంలో హతుడు సూఫీ బాబాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే హత్యకుగల కారణాలు ఇంకా తెలియరాలేదు.
హతుడి నుదిటిపై తుపాకితో కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య తరువాత దుండగులు, ఆయన ఎస్యూవీ స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. యోలా పోలీస్ స్టేషణ్ లో హత్యానేరం కింద కేసు నమోదు అయింది. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- Amul milk: సామాన్యుడి జేబుకు 'అముల్' చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
Read Also:Lavanya Tripathi: నాగార్జునతో రొమాన్స్ చేసి.. చైతూతో అలా నటించలేను
ఇటీవల దేశంలోని పలు సంఘటనలు ప్రజల మధ్య వైషమ్యాలు కలిగిస్తున్నాయి. గత వారం ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్యలాల్ ను ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. మహ్మద్ ప్రవక్తను అవమానించిన నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అతన్ని దారుణంగా చంపేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే తరహాలో మహారాష్ట్ర అమరావతిలో ఉమేష్ కొల్హే అనే వక్తిని కూడా దుండగులు హతమార్చారు. ఈ కేసులో కూడా నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ రెండు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తోంది.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!