Delhi: ఢిల్లీలో దారుణం.. తిట్టారన్న కోపంతో తల్లి, కొడుకును చంపేసిన పని మనిషి
- ఢిల్లీలో దారుణం
- తిట్టారన్న కోపంతో తల్లి, కొడుకును చంపేసిన పని మనిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తిట్టారన్న కోపంతో ఇంటి యజమానురాలిని, ఆమె చిన్న కుమారుడిని అత్యంత దారుణంగా పని మనిషి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: YV Subba Reddy: ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు.. సాయంత్రం 7 తర్వాతే పోలింగ్..!
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
ఢిల్లీలోని లజ్పత్ నగర్లోని ఓ ఇంట్లో ఇద్దరు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఇంటి యజమాని రుచిక సెవానీ, ఆమె కొడుకు.. పని మనిషిపై కేకలు వేశారు. అంతే కోపం పెంచుకుని.. రుచికను, ఆమె చిన్న కొడుకు గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Nithya Menen : ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా..
బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రుచిక భర్త కుల్దీప్ సెవానీ.. ఆఫీసు పని ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు మూసి ఉండటం గమనించాడు. భార్య, 14 ఏళ్ల కుమారుడు క్రిష్కు ఫోన్ చేశాడు. కానీ ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కుల్దీప్ సెవానీ గేటు దగ్గర, మెట్లపై రక్తపు మరకలు గమనించాడు. భయపడి.. అతడు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి భార్య, కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూసేసరికి భార్య, కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి అవాక్కయ్యాడు. రుచిక (42) మంచం పక్కన నేలపై పడి ఉంది. మొత్తం రక్తంతో నిండి ఉంది. ఇక కుమారుడు క్రిష్ పదో తరగతి చదువుతున్నాడు. బాత్రూమ్లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నాడు.
రుచిక సెవానీ తన భర్తతో కలిసి లజ్పత్ నగర్ మార్కెట్లో బట్టల దుకాణం నడుపుతూ ఉంది. దుకాణంలో పని చేసే ముఖేష్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరం నుంచి పారిపోతుండగా ముఖేష్ను అదుపులోకి తీసుకున్నారు. రుచిక, ఆమె కొడుకు తిట్టినందుకే చంపేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. ముఖేష్ది బీహార్. అమర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!