Terrorist Arrest: ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్.. ఐసిస్ మాడ్యూల్తో సంబంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్టు సమయంలో నిందితుల దగ్గర నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే లిక్విడ్ కెమికల్ సహా పలు కీలక సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. మహ్మద్ షానవాజ్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది.
WhatsApp: ఇండియాలో 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్ బ్యాన్..
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
ఢిల్లీలోని ఓ రహస్య స్థావరంలో ఈ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. పలు రాష్ట్రాల్లోని ఉగ్రవాద నెట్ వర్క్ లను అణచివేసేందుకు ఎన్ ఐఏతో కలిసి పనిచేస్తుంది. దాని ఆధారంగా వారిని అరెస్టు చేసింది. ఉగ్రవాది షానవాజ్.. పుణె ఐసిస్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీకి చెందిన ఈ టెర్రరిస్ట్.. పుణె పోలీసుల చెర నుంచి తప్పించుకుని.. అప్పటి నుంచి ఢిల్లీలో పోలీసుల కంట పడకుండా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఉగ్రవాదులను.. షానవాజ్, రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలాలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వీరి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.3 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని ఎన్ఐఏ ఇంతకుముందు ప్రకటించింది.
ఈ ఉగ్రవాదులు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఐసిస్ మిషన్ లో చేరినట్లు తెలిసింది. వీరికి మహారాష్ట్రలోని పుణెలో ఐసిస్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. దేశంలో హింస, ఉగ్రవాదాన్ని సృష్టించాలనుకున్నారని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాకుండా.. పేలుడు పదార్థాలను అసెంబుల్ చేయడానికి ఉపయోగించే డైపర్ స్టోర్ను అబ్దుల్లా పుణెలో నడుపుతున్నట్లు సమాచారం.
Meruga Nagarjuna: చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు..
మరోవైపు 2018లో రిజ్వాన్ అలీ, అతని తమ్ముడిని ఐఎస్ఐఎస్ లింకుల ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆ తర్వాత భద్రతా సంస్థలు వారికి వ్యతిరేకంగా ఆధారాలు చూపెట్టకపోవడంతో.. డీరాడికలైజేషన్ కార్యక్రమం అనంతరం అతడిని విడుదల చేశారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం పుణె వెళ్లి కంప్యూటర్ వ్యాపారం చేస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అంతేకాకుండా.. పెళ్లి చేసుకుని భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే రిజ్వాన్ తండ్రి ఆరోగ్య సమస్యల దృష్ట్యా రిజ్వాన్ దంపతులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
తాజావార్తలు
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!