Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. వినడానికే ఎంతో విచిత్రంగా ఉన్న ఈ కోణాలన్నీ కలిసిన ఒక దారుణమైన నిజ జీవిత కథ భోపాల్ పోలీసులనే షాక్కు గురిచేసింది. ప్రియుడితో భార్య కలిసి ఉండటం సహించలేని ఒక మహిళ, తన మాజీ ప్రియుడిని రంగంలోకి దించి ఓ నిండు ప్రాణాన్ని దారుణంగా బలితీసుకుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మోనూ రైక్వార్ అనే వ్యక్తి ఆగస్టు 23న తన భార్య రాఖీ రైక్వార్ కనిపించడం లేదంటూ రాతిబడ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం మొదలైంది. నాలుగు రోజుల పాటు పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆగస్టు 27న స్థానిక గోరేగావ్ ప్రాంతంలోని ఒక నిర్మానుష్య పాడుబడిన భవనంలో రాఖీ శవమై తేలింది. ఈ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మోనూ రైక్వార్ అనే వ్యక్తికి శశి రైక్వార్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మోనూ రైక్వార్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే మోనూ తన భార్య రాఖీతో కలిసి సంతోషంగా ఉండటం శశికి అస్సలు నచ్చలేదు. రాఖీని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన శశి, తన పాత ప్రియుడైన నరేంద్రను ఈ కుట్రలోకి లాగింది. ఆగస్టు 23న మోనూ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో రాఖీ, శశి మాత్రమే ఉన్నారు. పథకం ప్రకారం శశి తన మాజీ ప్రియుడు నరేంద్రను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి రాఖీపై దాడి చేశారు. శశి ఆమె నోరు నొక్కేయగా, నరేంద్ర గొంతు నులిమాడు. అంతటితో ఆగకుండా దుపట్టాతో గొంతుకు గట్టిగా ముడివేసి రాఖీ ఊపిరి తీసేశారు. హత్య అనంతరం శవం దొరక్కుండా ఉండేందుకు రాఖీ మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, ఇంటికి సమీపంలోనే ఉన్న ఒక పాడుబడిన భవనంలో పడేసి దాచిపెట్టారు. ఆ తర్వాత నరేంద్ర అక్కడి నుంచి పరారై ఇటార్సీకి పారిపోయాడు. ఇటు ఏమీ తెలియనట్లు నటిస్తూ భర్త మోనూతో కలిసే శశి కూడా నాటకమాడింది. పోలీసులకు ఎక్కడా అనుమానం రాకుండా ఉండేందుకు శశి జాగ్రత్తపడినా, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సందేహాస్పద కదలికల ఆధారంగా పోలీసులు శశిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల గట్టి విచారణతో శశి నిజం ఒప్పుకోక తప్పలేదు. తన ప్రియుడి భార్యను వదిలించుకోవడానికే పాత మిత్రుడు నరేంద్రతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆమె అంగీకరించింది. శశి ఇచ్చిన సమాచారంతో ఇటార్సీలో దాక్కున్న నరేంద్రను కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ భోపాల్ జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ అంకితా ఖాతర్కర్ వెల్లడించారు. భర్తపై ఉన్న మోజు, క్రూరమైన అసూయ చివరకు ఒక నిండు ప్రాణాన్ని తీసి, ఇద్దరినీ జైలు గోడల వెనక్కి నెట్టింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!